తన తోటి హీరోలందరూ దొంగలే.. బాంబు పేల్చిన విజయశాంతి..!!

టాలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుపొందింది హీరోయిన్ విజయశాంతి. అటు సినిమాలలో ఇటు రాజకీయాల్లో కూడా తన మార్క్ చాటుకుంటుంది విజయశాంతి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలలో నటిస్తూ భారీగానే రెమ్యూనికేషన్ అందుకుంటోంది. అలా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ విజయశాంతి కేవలం రాజకీయాలపై మాత్రమే ఫోకస్ చేస్తుంది. మొదటిసారిగా 1979లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

On Vijayashanthi's birthday, 6 powerful films which established her as  'Lady Amitabh' | Entertainment News,The Indian Express
ఇక విజయశాంతి హీరోయిన్గా ఫీడ్ అవుట్ అయిన తర్వాత పొలిటికల్ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.. అయితే ఆ తర్వాత పొలిటికల్ లో బాగా ఎదిగిపోయింది విజయశాంతి. అయితే ఒకానొక సమయంలో ఇమే ఒక ఇంటర్వ్యూలో తనతోటి హీరోల అందరి పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అలా ఒక ఇంటర్వ్యూలో మీ తోటి హీరోల గురించి చెప్పండి అంటూ ఒక ప్రశ్న ఎదురవ్వగా.. విజయశాంతి మాట్లాడుతూ.. రాములమ్మ వంటి సినిమాతో తనకి ఎనలేని స్టార్డం వచ్చిందని.. ఆ సమయంలో తను తెలంగాణ ఉద్యమ సమయంలో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది సపోర్ట్ చేయండి అంటూ అందరినీ అడగగా.. ఎవరు అప్పుడు ముందుకు రాలేదు అని.. తన బ్యాచ్ హీరోలంతా ముసుగు దొంగలు అని ఒక్కసారిగా బాంబు పేల్చింది విజయశాంతి. ఇక అంతే కాకుండా వారు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ లో కనీసం 20 శాతం ప్రజల సహాయం కోసం ఖర్చు చేసిన వారు సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోలు అనిపించుకునేవారు. కానీ అలా అనిపించుకునే ఏ హీరో కూడా తనకు కనిపించలేదని తెలియజేసింది.