సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా..రాజ్యమేలుతున్న బ్యూటీ. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఏం మాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది . ఈ సినిమాతోనే అక్కినేని కుర్రాడు నాగచైతన్య ని కూడా మాయ చేసింది. ఈ సినిమా టైంలోనే వాళ్ళ మనసులు కలిసి అలా అలా పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి చివరకు విడాకులు తీసుకునే వరకు చేసింది. దాదాపు వీరు విడాకులు ప్రకటించి 10 నెలలు కావస్తుంది. అయినా కానీ వీరి విడాకులు మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతుంది.
కాఫీ విత్ కరణ్ షోలో సమంత మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా మొదటిసారి నాగచైతన్య పై ఉన్న కోపాన్ని ఆ షోలో సమంత బయట పెట్టడం సంచలనంగా మారింది. ఆమె మాట్లాడిన మాటలు పద్ధతి పట్టి చూస్తే నాగచైతన్య మీద కోపం కాదు పగ తీర్చుకున్నట్లు ఉంది.నాగచైతన్య ఆమె భర్తగా కాకుండా ఎక్స్ భర్తగానే సంబోధించమని హోస్ట్ కరణ్ కు వార్నింగ్ ఇచ్చిన సమంత.. తమ విడాకులు ఏం కూల్ గా జరగలేదు అని వార్ కన్నా దారుణంగా జరిగాయని బిగ్ బాంబు పేల్చింది. అంతేనా తమను కానీ ఒకే గదిలో ఉంచాల్సి వస్తే పదునైన వస్తువుల్ని కూడా ఉంచాలని హోస్ట్ కరణ్ ను కోరింది. ఈ యొక్క మాటతో నాగచైతన్య అంటే సమంతకు ఎంత కోపమో ద్వేషము బయటపడింది అంటున్నారు సమంత ఫ్యాన్స్. ఒక ఆడపిల్ల నోరు తెరిచి ఈ విధంగా చెప్పడానికి కారణాలు ఏవైనా కానీ దానికి ముఖ్య కారణం మాత్రం భర్త అంటున్నారు సమంత అభిమానులు.
ఇలా సమంత నాగచైతన్య మధ్య వార్ లోకి ఒక హీరో తలదూర్చినట్లు తెలుస్తుంది. సైలెంట్ గా తన పని తాను చూసుకో పోయే బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా సమంత వ్యక్తిగత జీవితంలో ఎంటర్ అయినట్లు సమాచారం. కాఫీ విత్ కరణ్ షో కి అక్షయ్ కుమార్ తో కలిసి జాలీగా వెళ్ళిన సమంత.. అక్కడ వీళ్ళు వేసిన స్టెప్పులు.. చేసిన హంగామా బాలీవుడ్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. దానికి కారణం అక్షయ్ కుమార్ అన్నట్లు తెలుస్తుంది.
” కొంతకాలం నువ్వు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే పరిస్థితులు అన్నీ సర్దుమనుగుతాయి” అని అక్షయ్ కుమార్ సమంతకు కూల్ గా అర్ధమైయేలా చెప్పాడట.
అందుకే ఎంతమంది చెప్పినా మాటవినని సమంత అక్షయ చెప్పగానే సోషల్ మీడియాకు దూరమైందట. మీరు బాగా గమనించిన్నట్లైతే కాఫీ విత్ కరణ్ షో నుంచి వచ్చిన తర్వాత నుండి సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంది ఒక్క పోస్టు కూడా చేయలేదు. దానికి కారణం అక్షయ్ అని బాలీవుడ్ మీడియా ఉంటుంది. అక్షయ్ కుమార్ చెప్పడం వల్లే సమంత సోషల్ మీడియాకు దూరంగా అంటుందని బాలీవుడ్ మీడియా లో కధనాలు ప్రసారమవుతున్నాయి. అయితే దీనిపై సమంత హేటర్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. ” తప్పు చేశావు ఒప్పు చేశావో తెలియదు కనైఇ బాసు సమంత నోటికి తాళం వేసి మా నెత్తిన పాలు పోసావ్. నువ్వు శభాష్” అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.