మెగా ఈవెంట్: ఒకే వేదికపైకి గెస్టులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాకింగ్ స్టార్ యష్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రాకింగ్ స్టార్ యాష్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహే అంతటి ఉద్వేగాన్ని కలిగిస్తే, వారిద్దరూ కలిసి ఇక సినిమా చేస్తే మామ్మూలుగా వుంటుందా? ప్యాన్ ఇండియా షేక్ అయ్యిపోదూ! ఇద్దరు క్రేజ్ కా బాప్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అలాంటిదే ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఏ సినిమాకి ఈ ఈవెంట్ అని అనుమానం కలుగుతుందా? తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ బ్యూటీ కియారా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాం చరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంభందించిన మూడు ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఒక మోషన్ పోస్టర్ ని దుబాయ్ లో లాంచ్ చేయనున్నారు. దాన్ని మెగా ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. #Yash #PawanKalyan లను ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ లుగా కు పిలుస్తున్నట్లు సమాచారం.

అయితే ఇంకా ఈ విషయమై అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. రామ్ చరణ్ మార్క్ మాస్ సినిమా రచ్చకు ఇది కేవలం టీజర్ అంటున్నారు. రామ్ చరణ్ IAS అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసినదే. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం SS థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకి ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్‌ పరిశీలనలో వున్నాయి.