జనసేనకు జైకొట్టిన 30 ఇయర్స్ పృథ్వీ.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే?

ప్రముఖ సినీ నటుడు, 30 ఇయర్స్ ఇడస్ట్రీ పృథ్వీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుతో కలిసిన తర్వాత ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పృథ్వీ రాజ్ త్వరలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది..

కాగా 2014 ఎన్నికలకు ముందు పృథ్వీ రాజ్ వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తుండేవారు. 2019లో సీఎం జగన్ సీఎం అయ్యాక పృథ్వీ రాజ్ ను ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించారు. అయితే ఆ పదవి ఎక్కువ రోజులు నిలవలేదు.. ఓ మహిళతో రాసలీలలు నడిపించారనే ఆరోపణలతో ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.. దీంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది..

ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ రాజ్ వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేశారు. అదేసమయంలో జనసేనలో చేరే అవకాశం ఉందని టాక్ వినిపించింది. తాజాగా నాగబాబుతో భేటీ అనంతరం జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష పూర్తి అయిన తర్వాత ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది. అంతేకాదు ఆయన సొంత నియోజకవర్గం అయిన తాడేపల్లిగూడెం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.. అయతే పృథ్వీ రాజ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు..