ప్రెగ్నెంట్ అయిన 3 నెలలకే అబార్షన్.. చిన్మయికి ఇలా జరిగింది ఏంటి, పాపం!

చిన్మయి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, టీవీ ప్రెజెంటర్, రేడియో జాకీగా ఈమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. కాగా తాజాగా ఓ యూట్యూబ్ వీడియో ద్వారా తన ఫర్టిలిటీ జర్నీ, ప్రెగ్నెన్సీ బర్త్ స్టోరీ గురించి చాలా విషయాలను పంచుకుంది. తనకు అబార్షన్ కూడా అయ్యిందని చెప్పి షాక్ ఇచ్చింది. 2014లో చిన్మయి నటుడు రాహుల్ రవీంద్రన్ ని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి మొన్నటి వరకు ఆమెకు పిల్లలు లేరు. అంటే పెళ్లయిన 8 సంవత్సరాల వరకు వారు పిల్లలు లేకుండానే ఉన్నారు.

జూన్ 22, 2022న కవల పిల్లలు ద్రిప్తా, శర్వాస్‌కి చిన్మయి జన్మనిచ్చింది. అలా వెయిట్ చేసినందుకు గాను వారికి దేవుడు ఇద్దరు పిల్లలను ఒకేసారి ప్రసాదించాడు. మరి అబార్షన్ ఎప్పుడు అయ్యింది? చిన్మయి తన కెరీర్ కారణంగానో లేక మరే ఇతర కారణంగానో ప్రెగ్నెన్సీ ని వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ 2020లో మాత్రం 35 ఏళ్లు రావడంతో కచ్చితంగా పిల్లలను కనాలని అనుకుంది. అయితే అప్పుడే కరోనా, లాక్‌డౌన్ వంటివి రావడంతో తన ప్లాన్ మార్చుకుంది. మళ్లీ సెకండ్ వేవ్ తర్వాత పిల్లలను ప్లాన్ చేశానని చిన్మయి యూట్యూబ్ వీడియోలో చెప్పింది. అయితే అప్పుడు తాను గర్భవతి అయ్యానని కానీ మూడు నెలల తర్వాత అబార్షన్ అయ్యిందని ఆమె చెప్పి షాక్ ఇచ్చింది.

ఈ గర్భస్రావం తర్వాత ఆమె మానసికంగా చాలా డిస్టర్బ్ అయిందట. అప్పటికే ఆమెకు 37 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా కొంత కాలం ఆగితే పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా తగ్గుతుంది. అందుకే ఆమె వెంటనే ఒక డాక్టర్ని కలిసి ప్రత్యేకమైన డైట్, ఎక్సర్‌సైజులు చేస్తూ భారత ఆయుర్వేద పద్ధతులను పాటించింది. అలా కవలపిల్లలకు జన్మనిచ్చి మాతృత్వం మాధుర్యాన్ని రుచి చూసింది. తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి యూట్యూబ్‌లో వివరించి చిన్మయి ఇప్పుడు అభిమానులను ఫిదా చేస్తోంది.