యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు ఈ అమ్మడికి వరుస అవకాశలు దక్కాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి అలరించింది. టాప్ డైరెక్టర్ శంకర్ డైరక్షన్లో వచ్చిన అపరిచితుడు సినిమాతో భారీ హిట్ ను అందుకుంది సదా. ఈ సినిమా హిట్తో తమిళ్ లో కూడా నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా వరుస సినిమాలతో దూసుకుపోయింది.
అయితే , ఎంత త్వరగా స్టార్ హీరోయిన్ అయ్యిందో అంతే త్వరగా..ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం సదా సినిమాలు చేయిడంలేదు. పలు టీవీ షోల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ ఫాంలోకి వచ్చింది సదా. ఈ క్రమంలోనే అమ్మడి గురించి ఓ వార్త బాగా వైరల్ గా మరింది. అది ఆమె పెళ్లికి సంబంధించి కావడంతో కుర్రాళ్లు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
తమిళ్ లో వరుస సినిమాలు చేస్తు అక్కడ టాప్ హీరోయిన్గా మారిన సదా.. హీరో మాధవన్ తో చాలా చనువుగా మూవ్ అయ్యేది. సద ఆయన తో మూడు సినిమాల్లో నటించింది. వీటిలో ప్రియా సఖి సినిమా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అయితే ఆ సినిమా సమయంలో సద మాధవన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. వారు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని చాలా వార్తలు వైరల్ అయ్యాయి.
అంతేకాదు ఓ బడా ఫ్యామిలీకి కోడలు కావాల్సిన సదా తన క్యారెక్టర్ బాగోలెదనే రూమర్ తోనే ఆ ఇంటికి కోడలిగా వెళ్ళలేకపోయిందని కూడా వార్తలు వినిపించాయి. అలాంటి టైంలో ఆ వార్తలు విని సదా చాలా బాదపడ్డారట. “ఇలాంటి రూమర్లు విని మొదట్లో చాలా బాధగా అనిపించేదని.. కానీ ఆలాంటి రూమర్స్ రావడం కామనే అని ఇప్పుడు పట్టించుకోవడం మానేశా” అని రీసెంట్ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది సదా.