స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన నటనతో అందంతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకొని ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసి మరీ కుర్ర కారు గుండెల్లో నిద్ర లేకుండా చేస్తుంది. ఇక వివాహానికి ముందు కేవలం సెలెక్టెడ్ పాత్రలో మాత్రమే నటించిన సమంత వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. కానీ నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాలలో తన జోరు పెంచిందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో, ఐటెం సాంగ్ లలో మాత్రమే కాకుండా బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి కూడా ఈ ముద్దుగుమ్మ వెనకాడడం లేదని తెలుస్తుంది.
ఇక ద ఫ్యామిలీ మెన్ టు సిరీస్ తో ఏకంగా బాలీవుడ్ ని కూడా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లలో నటించడం వల్లే కుటుంబంలో గొడవలు తలెత్తి విడాకులు తీసుకున్నారు అనే విషయం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. కానీ ఆమె ఏమాత్రం లెక్కచేయకుండా తన భర్తకు కూడా విడాకులు ఇచ్చి ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధమయింది. ఇక ఇలాంటి పాత్రలే కాకుండా పౌరాణిక చిత్రాలైన శాకుంతలం వంటి సినిమాలో కూడా నటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది .ఇక మరొకవైపు లేడీ ఓరియంటెడ్ మాస్, యాక్షన్ ఎలివేషన్స్ తో కూడిన యశోద సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అంతేకాదు విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా చిత్రమైన ఖుషి మూవీ లో కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఒకవైపు వరుస చిత్రాలు చేస్తూనే మరొకవైపు బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేసి అక్కడ కూడా తన మార్కును ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది సమంత. ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటిని అధికారికంగా ప్రకటించకపోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల పారితోషకం తీసుకునే సమంత మొదటిసారి కేవలం రూ.500 పారితోషకంగా తీసుకున్నదట.
ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆమె పదవ తరగతి స్కూలింగ్ చదువుతున్న సమయంలో ఒక కాన్ఫరెన్స్ కోసం హోటల్లో హోస్టెస్ గా వర్క్ చేయడానికి వెళ్ళిందట. అక్కడ సుమారుగా ఎనిమిది గంటలు షిఫ్టులో పనిచేశానని.. అందుకు వారు 500 రూపాయలు పారితోషకంగా ఇచ్చారు అని సమంత తెలిపింది. ఇక ఆ డబ్బును ఎప్పటికీ మరిచిపోలేనని కూడా తెలిసింది.