తెలుగు చిత్ర పరిశ్రమలో అలుపెరుగని బాటసారిలా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన ఈమె ఏకంగా 1850 కి పైగా తెలుగుతోపాటు ఇతర భాషా చిత్రాలలో నటించి.. 30కి పైగా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని.. పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలియజేసిన రమాప్రభ ..సినీ రంగానికి కాస్త దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వయసు 70 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ చాలా చలాకీగా అందరినీ నవ్విస్తూ నవ్వుతూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.
ఇకపోతే తాను యుక్త వయసులో ఉన్నప్పుడు నటించిన కొన్ని చిత్రాలకు సంబంధించిన ప్రదేశాలను చూడడానికి ఆమె బెంగళూరుకు కూడా వెళ్లి అక్కడే అన్ని ప్రదేశాలను చూసి తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే మీడియా ముందుకు వచ్చిన ఈమె కొద్దిసేపు మాట్లాడినట్లుగా కూడా సమాచారం. చిలుక గోరింక అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రమాప్రభ తెలుగు సినీ ఇండస్ట్రీలో లభించిన అన్ని పాత్రలు మరే ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా లభించలేదు అని.. ప్రస్తుతం సినీ జీవితం ద్వారా ఎంతో సంతృప్తిగా ఉన్నానని ఆమె తెలియజేసింది.
ఇకపోతే జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నావా అని అడిగితే అది కేవలం ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు మాత్రమే అని.. ఇక ఆయన కోరితే శబరి లాంటి పాత్రలలో చేయడానికి తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని కూడా తెలియజేసింది రమాప్రభ. మరి ఇప్పుడు ఎందుకు నటించడం లేదు అని ప్రశ్నించగా తాను మాత్రం సినిమాలలో నటిస్తే పాత తరాన్ని అవమానించినట్లేనని తాను భావిస్తున్నట్టుగా తెలియజేసింది. ఇకపోతే సినిమాలు గతంలో సమాజానికి సందేశం ఇచ్చేలా ప్రేక్షకులు ఇష్టపడేలా ఉండేవి కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఇకపోతే ఇది విన్న నెటిజన్స్ కూడా పూరీ జగన్నాథ్ రమాప్రభ కోసం ఒక శబరి క్యారెక్టర్ ఉండే పాత్ర ఇవ్వాలి అని కోరుకుంటున్నారు.