ఆ దెబ్బతో సినిమాలే వదిలేద్దాం అనుకున్న కళ్యాణ్ రామ్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలతో అలరిస్తూ ఉంటాడు కళ్యాణ్ రామ్. ఇక తను నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించి పలు ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 3డి సినిమాని పరిచయం చేసింది కళ్యాణ్ రామే. అయితే ఈ సినిమా దెబ్బకు సినిమాలు కూడా మానేద్దామనుకున్నాడట. ఆ పరాజయం నుంచి పలు పాఠాలు కూడా నేర్చుకొచ్చానని తెలియజేశారు.

కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడుగా వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఓం 3D సినిమా గురించి తెలియజేశారు. ఆ సినిమా మీద చాలా నమ్మకంగా ఉండేది. దాదాపుగా మూడు సంవత్సరాలు వేరే కథ వినకుండా ఆ సినిమా కోసం పనిచేశానని కానీ ఆ సినిమా రిజల్ట్ చాలా నిరుత్సాహాన్ని ఇచ్చిందని తెలియజేశారు కళ్యాణ్ రామ్. దాంతో ఒక్కసారిగా తను వెళుతున్న దారి సరైనదా లేదా అన్న సందేహంలో కూడా పడ్డాడట.

అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత కొన్ని నెలల పాటు ఎవరిని కలవలేదు. ఆ సమయంలో తమ ఫ్యామిలీ నుంచి వచ్చిన సపోర్టు వల్లే మళ్ళీ నిలబడ్డాన ని తెలియజేశాడు కళ్యాణ్ రామ్. తన జీవితంలో ఓం 3D సినిమా తనకు తగిన గుణపాఠం నేర్పింది అని లైఫ్ లో రిస్కు చేయాలి కానీ కొన్ని లెక్కలు వేసుకొని చేయాలని ఆ సినిమా వల్లే తెలిసి వచ్చిందని తెలియజేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం బింబిసార సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ బిజినెస్ కూడా బాగా పెరిగింది అని తెలిపారు.