కనిపించకుండా పోయిన నివేధా థామస్.. గ్యాప్ తీసుకుందా?

బొద్దుగా కనిపిస్తూ కుర్రాళ్ల మతిపొగోట్టిన నివేదా థామస్.. ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తన అందచందాలతో కుర్రాళ్ల మనస్సులను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నివేదా థామస్ కు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి.

ఈ తర్వాత నానితో కలిసి మళ్లీ నిన్ను కోరి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో నివేదాకు టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి స్థానం దక్కింది. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ, ఆ తర్వాత బ్రోచేవారెవరురా వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక పవన్ కల్యాణ్ హీరోగా వేను శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించిన నివేదా థామస్.. ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ సినిమాలో నివేదా నటించిన వేముల పల్లవి పాత్రకు విమర్శలు నుంచే కూడా ప్రశంసలు వచ్చాయి.

అయితే ఆ తర్వాత నుంచి నివేదా థామస్ ఏ సినిమాలోనూ కనిపించడం లేదు. దీంతో ఆమె ఎక్కడికి పోయిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కావాలనే ఈ బ్యూటీ గ్యాప్ తీసుకుందా.. లేదా సినిమా అవకాశాలు తగ్గాయాఅనేది అర్థం కావడం లేదు. టాలీవుడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న శాకిని డాకిని అనే మూవీలో నివేదా ధామస్ నటించాల్సి ఉంది. అయితే గత ఏడాది ఈసినిమాకి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ తర్వాత శాకిని డాకిని సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.

దీంతో ఆ సినిమా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫలింస్ క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా సాగనుంది.