తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు రాజేంద్రప్రసాద్ అంటే తెలియని వారంటూ ఉండరు. గతంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే హీరోగా ఉన్న సమయంలో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లుగా రాజేంద్రప్రసాద్ గురించి ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపించేవీ వాటి గురించి చూద్దాం.
అలనాటి హీరోయిన్ రజిని ప్రతి ఒక్కరికి సుపరిచితమే వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ. మొదట బ్రహ్మముడి అనే చిత్రంతో ఈమె తన కెరీర్నే ప్రారంభించింది. ఆ తర్వాత దాదాపుగా 100కు పైగా సినిమాలలో నటించింది. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక వీటితోపాటు నటుడు రాజేంద్రప్రసాద్ తో కూడా ఎక్కువ సినిమాలు నటించడంతో ఈమెకు రాజేంద్రప్రసాద్ కు మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు అప్పట్లో పేపర్లలో కూడా వచ్చాయట. అయితే ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది రజిని.రజిని మాట్లాడుతూ తనకు ఏ హీరోలతో నటించినా అంతగా కంఫర్ట్ ఉండేది కాదు.. ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్ల మాదిరి అందరు హీరోలతో మాట్లాడే అవకాశం ఉండేది కాదు షూటింగ్ అయిపోయాక సరాసరి ఇంటికి వెళ్లే వాళ్ళం. కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే చాలు మీడియాలో పలు కథనాలు రాసేసి ఉంటారు. అలాంటి వార్త ఇది కూడా అని తెలియజేసింది రజిని. రాజేంద్రప్రసాద్ గారికి ఆరోగ్యపరంగా పలు జాగ్రత్తలు పాటించేవారు ఆయన ఒక సందర్భంలో రజిని నువ్వు ఇంత తెల్లగా ఎలా ఉన్నావని ఒక అడగగా.. అందుకోసం కొన్ని టిప్స్ చెప్పాను.. ఇక అప్పటినుంచి తనని కూడా ఫాలో అవుతూ తను చేసే పనులన్నీ చేసే వారిని తెలిపింది. ఇక రజిని తల్లికి కూడా రాజేంద్రప్రసాద్ అంటే చాలా క్లోజ్ కావడంతో అలా మా ఇద్దరి మధ్య కాస్త క్లోజ్ నెస్ పెరిగిందని తెలియజేసింది రజిని. అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా గాసిప్ సృష్టించాలని క్లారిటీ ఇచ్చింది.