జబర్దస్త్ కార్యక్రమం సాధారణంగా కామెడీ షో తో బాగా పాపులర్ అవుతుంటే. గత కొన్ని రోజుల నుంచి ఈ షో నుంచి పలువురు సీనియర్ కమెడియన్లు వెళ్లిపోవడం.. అందులో కిరాక్ ఆర్పి జబర్దస్త్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆర్పి చేసిన మాటలపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమదైన శైలిలో కిరాక్ ఆర్ పి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని కిరాక్ ఆర్పి మల్లెమాల సంస్థ గురించి అలాగే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలపై కొంతమంది స్పందిస్తూ ఆర్పీకి మద్దతు తెలుపగా.. మరికొందరు మాత్రం ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని, పూర్తిగా అవాస్తవాలే ఉన్నాయంటూ రాంప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ శేషు వంటి జబర్దస్త్ కమెడియన్లు మాత్రమే కాకుండా మరి కొంతమంది దర్శక నిర్మాతలు సైతం కిరాక్ ఆర్ పీ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోని ఈ విషయాలపై మరొకసారి కిరాక్ ఆర్పీ స్పందించడం జరిగింది.. ఇక ఆయన మాట్లాడుతూ నేను చెప్పిన మాటలన్నీ అవాస్తవమని ఎవరైనా నిరూపించగలిగితే.. కచ్చితంగా గుండు కొట్టించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్ పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక జబర్దస్త్ కార్యక్రమం గురించి తాను చెప్పిన మాటలు నిజమేనని , తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఇక నేను ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది జబర్దస్త్ కమెడియన్లు అన్ని విషయాల గురించి బాగా ఓపెన్ అయ్యావు అంటూ ఫోన్లో మెసేజ్లు కూడా చేశారు అని, అవన్నీ ఆధారాలు ఉన్నాయని, ఇక షేకింగ్ శేషు ను తన జీవితంలో అసలు వదిలిపెట్టనని కూడా ఆర్ పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత మల్లెమాల గురించి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి కిరాక్ ఆర్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయన వెనుక ఎవరో ఉన్నారనే వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.