నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేసిన ఆహో ఓటీటీ టాక్ షో ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ టాక్ షో ఎన్నో సంచలనాలకు వేదిక అయ్యింది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, ఎన్టీఆర్, నాని, నాగార్జున, రానాతో పాటు సమంత లాంటి వాళ్లు కూడా ఎన్నో టాక్ షోలను హోస్ట్ చేశారు. అయితే వీళ్లెవ్వరికి రాని క్రేజ్ అన్స్టాపబుల్ షోతో బాలయ్యకు వచ్చింది. అసలు బాలయ్య ఈ టాక్ షోను హోస్ట్ చేసిన తీరుకు బుల్లితెర అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు.
ఈ షో తర్వాతే బాలయ్యకు బుల్లితెరతో పాటు ఈ తరం యూత్ జనరేషన్లో కూడా విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు. ఇక అన్స్టాపబుల్ షో ఐఎండీడీలో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. అలాగే ఎక్కువ క్లిక్స్ సొంతం చేసుకున్న టాక్ షోగా కూడా రికార్డుని సొంతం చేసుకుంది. సెలబ్రిటీ టాక్ షోల్లో బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది.
తాజాగా ఈ షో ఖాతాలో రెండు సిల్వర్ ట్రోఫీలు వచ్చి చేరాయి. బెస్ట్ రీజినల్ టీవీ ప్రోగ్రామ్, బెస్ట్ రీజినల్ టీవీ రియాలిటీ షో విభాగాల్లో రెండు అవార్డులు ఈ షో సొంతం అయ్యాయి. రెండు విభాగాల్లో ఈ షోకు రెండు అదిరిపోయే అవార్డులు రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులే లేవు. బాలయ్య ఈ వయస్సులో ఈ రేంజ్లో ఈ టాక్ షోను హోస్ట్ చేసిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ మరో పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది.