Acharya: కొరటాల చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే..!!

పాపం..ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట..ఒక్క సినిమాతో సర్వ నాశనం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు కొరటాల అంటే..కత్తి..తోపు..సినిమా తీస్తే హిట్టే..ఢీ కొట్టే డైరెక్టర్ నే లేడు అంటూ ఆకాశానికి ఎత్తేసిన జనాలే.. ఇప్పుడు బుర్ర ఉందా కొరటాల..నీ రేంజ్ సినిమా కాదు ఇది..ఏమైంది నీకు.. మీ దగ్గర నుండి ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు మేము అంటూ మండిపడుతున్నారు. ఆచార్య సినిమా చూసిన జనాలకి ఇదే అనిపిస్తుందట. సినిమా లో స్టోరీ ఉందా..? కామెడీ లేదు..హీరోయిన్ పాత్ర దేనికి పనికి వచ్చింది..అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమాకి కొరటాల రాసుకున్న స్టోరీ వేరే గా ఉంటుందట. అస్సలు కొరటాల రాసుకున్న కధలో చరణ్ నే లేడు..పూజా లేదు. మొత్తం కాజల్-చిరు ల మధ్యే నడుస్తుంది. కానీ, మధ్యలో మెగాస్టార్ ఎంటర్ అయ్యి..స్టోరీని మార్చేయడం..ఆ మూమెంట్ కే కొరటల మనసు మార్చుకుని..స్టోరీ లోకి చరణ్ ని తీసుకురావడం.. ఇక చరణ్ కోసం పూజా హెగ్డే ని సెలక్ట్ చేయడం.. అలా పూజా మాయలో కాజల్ ని మర్చిపోయి.. ఆమెను సినిమా నుండి తీసేసి..సినిమాకి కోలుకోలేని దెబ్బ వేసుకున్నాడు. ఇప్పుడు జనాలు మాట ఏమిటంటే,,కొరటాల ఎవ్వరి మాట వినకుండా తన స్టైల్ లో సినిమా తెరకెక్కించుంటే..ఈ సమస్య ఉండేది కాదు.

కొరటాల ముందు తీసిన సినిమాలు జనాలకి నచ్చినప్పుడు.. ఇప్పుడు తీసిన ఆచార్య కూడా నచ్చి ఉండేది. బ్లాక్ బస్టర్ కాకపోయినా జనాలు ఆయన స్టైల్ ని లైక్ చేసే వారు. కానీ కొరటాల చిరంజీవి మాటలు విని ఆచార్య విషయంలో బిగ్ మిస్టేక్ చేశారు అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు సినిమాకి పూజా కన్నా కూడా కాజల్ అయితే కలిసి వచ్చి ఉండేది. ఎందుకంటే సినిమా చరణ్ ది గెస్ట్ రోల్..ఆయన పాత్ర కి హీరోయిన్ ని పెట్టుకున్నారే కానీ.. అసలు పాత్ర అయిన చిరు కు అమ్మాయినే పెట్టలేదు. మెగా ఫ్యామిలీకి కాజల్ లక్కి గార్ల్..అలాంటి ఆమెను తీసేసి కొరటాల తప్పుచేశాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి తారక్ తో తీయ్యబోయే సినిమాకి అయినా జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో చూడాలి..?