టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలకు స్టైలిష్ డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేయడంలో శేఖర్ మాస్టర్ టాప్. అంతేగాక ఢీ వంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కొత్త ట్యాలెంట్ను ఎంకరేజ్ చేస్తుంటాడు. అయితే ఇదంతా రూపాయి నాణేనికి ఒకవైపులా, శేఖర్ మాస్టర్ అండ్ అతడి టీమ్కు కూడా మరో రూపం ఉందని తెలుస్తోంది.
తాజాగా ఓ వీడియోలో దీనికి సంబంధించి ఓ షాకింగ్ విషయం బట్టబయలు అయ్యింది. శేఖర్ మాస్టర్ ప్రొడ్యూసర్గా మారి ‘ధర్మపురి’ అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో అవకాశం ఇప్పిస్తామని ఓ కుర్రాడి వద్ద శేఖర్ మాస్టర్ మేనేజర్ ఏకంగా రూ.50 వేలు పుచ్చుకుని అతడికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో ఆ కుర్రాడు కెమెరా పట్టుకుని నేరుగా శేఖర్ మాస్టర్ ముందు ప్రత్యక్షమై అక్కడే ఉన్న శేఖర్ మాస్టర్ అండ్ టీమ్తో గొడవకు దిగాడు.
తాను క్యారెక్టర్ కోసం డబ్బులు ఇచ్చి మోసపోయానని.. తనకు తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనని శేఖర్తో వాగ్వివాదానికి దిగుతాడు. అయితే సినిమాల్లో ఎప్పుడూ ట్యాలెంట్తోనే పైకొస్తారని.. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఫేం రాదని శేఖర్ అతడికి చెబుతాడు. చివరకు అతడి వద్ద డబ్బులు తీసుకున్న మేనేజర్ను పట్టుకున్నాక అతడి డబ్బులు తిరిగి ఇప్పిస్తానని శేఖర్ చెప్పడంతో ఆ కుర్రాడు వెళ్లిపోతాడు.
అయితే ఇదంతా కేవలం ఓ ప్రాంక్ వీడియోగా, ధర్మపురి సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో తీసినట్లు మనకు తెలుస్తోంది. కాగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వారు ఉంటారని.. అందుకే ఎవరూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దనే మెసేజ్ను శేఖర్ మాస్టర్ ఈ వీడియో ద్వారా ప్రేక్షకులు చెప్పాలని చూశాడు. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడం విశేషం.