RRRకి సీక్వెల్‌..ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్‌..!!

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం RRR కి సీక్వెల్‌ రావచ్చు అనే ఆన్సర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..ఇద్దరు బడా హీరోలు చరణ్-తారక్ లతో కలిసి సృష్టించిన అధ్బుతమైన సినిమా “రణం రౌద్రం రుధిరం”. మార్చి 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ప్రతి ఇండియన్ కాలర్ ఎగరేసి ఇది మా ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకునే రేంజ్ లో జక్కన్న తెరకెక్కించాడు ఈ సినిమాని. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ గా ఉన్నాయి. తారక్-చరణ్ ల పర్ ఫామెన్స్ పీక్స్ లో ఉంది. అటు నందమూరి ఫ్యాన్స్ ని ఇటు మెగా ఫ్యాన్స్ మెప్పించిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా రికార్డ్ లు సృష్టిస్తుంది. ప్పటి వరకు 710 కోట్ల(గ్రాస్‌) రూపాయల వసూళ్ల రాబట్టి.. సరికొత్త రికార్డుని సృష్టించింది.

కాగా, RRR సినిమా ఇంతటి భారీ విజయం అందుకోవడంతో ఆ కధను రాసిన విజయేంద్ర ప్రసాద్‌ రాజమౌళి తండ్రి రీసెంట్ గా ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..” సినిమా ఇంతటి ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషం గా ఉంది. రాజమౌళి-చరణ్-తారక్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. జనాలు మంచిగా ఈ సినిమా గురించి పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది ఈ సినిమా కి సీక్వెల్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఇది వరకే తారక్ ఓ సారి నన్ను అడిగాడు..ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ ఉంటే బాగుంటుంది అని. నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్‌, రాజమౌళికి బాగా నచ్చాయి. టైం కలిసి వచ్చి ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్‌ రావొచ్చు’అని విజయేంద్రప్రసాద్‌ చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా ఈ సినిమా తెరకెక్కిస్తే బాగుంటుంది అని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..?