చిల్లర పనులు చేసి పరువు తీయ్యకు..చరణ్ షాకింగ్ కామెంట్స్…?

మెగాస్టార్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి కొడుకు రాం చరణ్..రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేసి..అద్భుతమైన విజయాని అందుకున్నాడు. సినిమా లో తన పర్ఫామెన్స్ కి ..ఎక్స్ ప్రేషన్స్ కి డ్యాన్స్ కి మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. ఇప్పట్లో మరే సినిమా కూడా ఈ రికార్డ్లు బద్దలు కొట్టలేవు అనడంలో సందేహం లేదు.

కాగా, మరికొద్ది రోజుల్లో తండ్రి చిరు తో కలిసి చరణ్ నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కాబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మనం చరణ్ ని ఇదివరకు ఎప్పుడు చూడని రోల్ లో చూడబోతున్నాం. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా పూజా నటిస్తుంటే..చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు.

ఇక చరణ్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC15. కోలీవుడ్ బడా డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పోలిటికల్ రివేంజ్ గా ఉంటుందని సమాచారం .అంతేకాదు ఈ సినిమాలో చరణ్ ని మనం సీ ఎం గా చూడబోతున్నాం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నటిస్తుంది . నిజానికి కధ ప్రకారం చరణ్ కి లవ్, రొమాన్స్ , గర్ల్ ఫ్రెండ్ ఇలా ఏం ఉండవు..కానీ సినిమాలో కియార చరణ్ ని ఇష్ట పడుతూ ఉంటుంది . కానీ చరణ్ కి ఇష్టం ఉండదు. ఓ సీన్ లో చరణ్ ని తన అందచందాలతో కియార రెచ్చకొడుతూ తప్పుగా ప్రవర్తిస్తుందట..ఇక ఆ సమయంలో చరణ్ ఆమెను లాగి కొట్టి..చిల్లర పనులు చేసి పరువు తీసుకోకు అంటూ ఓ భారీ డైలాగ్ చెప్పుతాడట. సినిమాకే ఆ వర్డ్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. కాగా, కియార మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకుంది.