మహేష్ బాబు ఫ్యాన్స్‌కి పండగే..క్రేజీ మ్యాటర్ బయటపెట్టిన రాజమౌళి.. !!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నదానికి మించి RRR విజయవంతం అవ్వడంతో చిత్ర బృందం సూపర్ ఖుషీ గా ఉన్నారు. దాదాపు నాలుగేళ్ళు రాత్రి పగలు కష్టపడి..కష్టపెడుతూ..కరోనా లాంటి మహమ్మారితో పోరాడుతూ.. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా నే రణం రౌద్రం రుధిరం. చరణ్-తారక్ ఇద్దరు కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగరాస్తుంది.

కాగా, ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో..ముంబైలో RRR సక్సెస్ మీట్ ను గ్రాండ్ నిర్వహించారు టీం. ఈ కార్య క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నిజానికి రాజమౌళి ఒక్క సినిమా మీట్ లో మరో సినిమా గురించి మాట్లాడడు. రిపోర్టర్స్ అడిగిన అదే జవాబుఇస్తాడు. కానీ ఈసారి RRR హ్యాపీ మూడ్ లో ఉన్న జక్కన్న రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ..క్రేజీ మ్యాటర్ ను లీక్ చేశాడు.

మనకు తెలిసిందే రాజమౌళి తన తరువాతి ప్రాజెక్ట్ ను మహేష్ బాబు సినిమాతో చేయబోతున్నాడని. అప్పుడెప్పుడో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఓ లైన్ చెప్పాడే కానీ, ఇప్పటి వరకు అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు ఈ సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కాగా,RRR సక్సెస్ మీట్ లో జక్కన్న మాట్లాడుతూ..మహేష్ బాబు కోసం రెండు కధలను సిద్ధం చేసుకున్నాను అని..అందులో ఒకటి ఆఫ్రికా అడువుల నేపధ్యంలో ఉంటుందని ..మహేష్ బాబు బాడీకి ఈ స్టోరీ బాగా సూట్ అవుతుందని అనుకుంటున్నాను అని..ఈ ఏడాది లోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని..మహేష్ ఫ్యాన్స్ కు పండగలాంటి న్యూస్ చెప్పారు. ఇక దీంతో #SSMB29 హష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.