‘ఛీ’రు ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులా..హవ్వా..?

సోషల్ మీడియా పుణ్యామా అని ఏ న్యూస్ అయిన క్షణల్లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల కు సంబంధించిన వార్త జెట్ స్పీడ్ కంటే అందరికి ఫాస్ట్ గా రీచ్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి ఓ న్యూసే నెట్టింట పెద్ద దుమారం రేపుతుంది. జనరల్ గా మన పెద్ద వాళ్ళు అంటుంటారు.. మన కళ్ళతో చూసేది అంత నిజం కాదు.. దానికి వెనక ఏదో ఉంటుంది అని. ప్రజెంట్ అదే నిజం అనిపిస్తుంది ..పై ఫోటోని చూస్తుంటే. మీరు బాగా గమనించిన్నట్లైతే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో చిరంజీవి-పూజాని హగ్ చేసుకున్నట్లు ఉంది.

కానీ, మీరు అసలు నిజం క్రింద వీడియోలో చూడవచ్చు. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా గా చేస్తున్న మూవీ “ఆచార్య”. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్డే చేస్తుంది. ఇక చిరంజీవి పక్కన హీరోయిన లేనట్టే అని తాజాగా కొరటాల క్లారిటీ ఇచ్చేశాడు. ఆ విషయం పక్కన పెడితే. సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ అవుతుంది. మరి కొద్ది గంటలే మిగిలిఉంది.

కొరటాల చిత్ర ప్రమోషన్స్ ని యమ స్పీడ్ గా లాగేస్తున్నారు. భారీ రేంజ్ లో కాకపోయినా.. పర్లేదు అన్నట్లు ప్రెస్ మీట్లు.. ఇంటర్వ్యులు ఇస్తునారు. అయితే రీసెంట్ జరిగిన ఓ ప్రెస్ మీట్ లో చరణ్-చిరు-పూజా-కొరటాల పాల్గొన్నారు. మీడియా ప్రశ్నలకి ఓపికగా సమాధనం ఇచ్చారు. అంతా బాగుంది ..ఇక ఫైనల్ గా ఫోటోలు తీసుకుని.. ప్యాకప్ చెప్పేస్తారు. జనరల్ గానే ఫోటో షూట్ లో హీరోయిన్ ని హైలెట్ చేస్తారు. ఇక్కడ కూడా పూజా ను మిడిల్ లో పెట్టుకుని ఓ పక్క చిరంజీవి..మరో పక్క చరణ్ ఫోటోలు దిగారు. ఇక పూజా వెళ్లిపోతున్న క్రమంలో అక్కడే ఉన్న ఫోటో గ్రాఫర్ చిరు తో పూజా ని ఓ ఫోటో స్టిల్ అడిగాడు. సరే.. పుజా కూడా హ్యాపీ గా వచ్చి మెగాస్టార్ పక్కన స్టైల్ గా నిల్చుని ఫోటో తీసుకుంది. ఆ టైంలో చిరు పొరపాటున చరణ్ అనుకుని హగ్ చేసుకున్నట్లు స్టిల్ ఇవ్వబోయాడు. అంతే..అక్కడే ఉన్న ఫోటో గ్రాఫర్లు టపీ టపీ మని ఫోటోలు తీసి.. అవి కాస్త నెట్టింట వైరల్ చేసిపడేశారు. ఇక మెగా ఫ్యాన్స్ యాంటీ బ్యాచ్ ఆ ఫోటోలని పట్టుకుని తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి పనులా..? అంటూ కావాలనే టార్గెట్ చేస్తున్నారు ఓ సో కాల్డ్ పని లేని బ్యాచ్. దీంతో పూజా చిరు ఫోటోలు వైరల్ గా మారాయి.