మాస్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్.. ఇక దబిడిదిబిడే..?

నందమూరి బాలకృష్ణ వయసు తో సంబంధం లేకుండా.. నేటికి నటన పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో వరుస సినిమాలకు కమిట్ అవుతూ..సూపర్ డూపర్ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ మధ్యనే అఖండ సినిమా తో తిరుగులేని విజయాని అందుకున్న బాలకృష్ణ ..త్వరలోనే మరొ మాస్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాడు. ప్రజేంట్ గోపీచంద్ మల్లినేని తో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న బాలయ్య..ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో మెప్పించనున్నాడట.

ఈ సినిమా కి మెయిన్ ప్లస్ స్టోరీ అయితే.. సెకండ్ లుక్స్ అంటున్నారు. మనం ఇప్పటి వరకు చూడని కొత్త బాలయ్యని ఈ సినిమాలో చూడబోతున్నాం అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా స్టార్ డాటర్ శృతి హాసన్ నటిస్తుంటే.. ఆయనను ఢీ కొట్టే పాత్రలో మరో స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే..బాలయ్య డైనమిక్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో కమిట్ అయిన సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.

మనకు తెలిసిందే అనిల్ బాలయ్య కు పెద్ద ఫ్యాన్ . ఈ విషయాని ఆయనే చాల ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఆయనతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారట. కాగా , ఈ సినిమాలో మాస్ హీరో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నారంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో రవి తేజ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడట. బాలయ్యతో సై అంటే సై అనే రేంజ్ లో విలన్ రోల్ ఉంటుందని..ఆ పాత్రకు రవితేజ అయితే సూట్ అవుతాడని అనిల్ అభిప్రాయం. ఈ విషయమే రవికి చెప్పగా..ఆయనకు ఫ్లాప్ టైంలో రాజ ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అభిమానంతో ఈ సినిమాను యాక్సెప్ట్ చేశాడట. రవితేజ కి కూడా బాలయ్య అంటే చాలా ఇష్టం. మొన్న ఈ మధ్య పాల్గొన్న అన్ స్టాపబుల్ లోను ఇదే మాట చెప్పుకొచ్చారు. సో.. ఇద్దరు మాస్ హీరోలు తెర పై పోట్లాడుకుంటే ఎలా ఉండబోతుందో మనం ఈ సినిమా ద్వారా చూడబోతున్నం అనమాట . మరి చూడాలి అనిల్ మన బాలయ్య ను ఎలా చూపిస్తాడో..?