దర్శక నిర్మాతల కోరిక తీర్చినందు వల్లే ఆ హీరోయిన్ జీవితం నాశనం..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అనుకుంటే కచ్చితంగా దర్శకనిర్మాతల పక్కలో పడుకోవాలి. వారి కోరిక తీర్చకపోతే అవకాశాలు కూడా రానివ్వరని ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ దర్శక నిర్మాతలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది అంటే తప్పకుండా ఆ హీరోయిన్ ని సినీ ఇండస్ట్రీ ఆదరిస్తుంది అనే మాట వాస్తవం. అలా సినిమా అవకాశాలు బాగానే వస్తాయి. కానీ తన విషయంలో మాత్రం అలా జరగలేదు.. దర్శక నిర్మాతలు తన జీవితాన్ని నాశనం చేశారని తెలియజేస్తోంది.

పదేళ్ల క్రితం ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ ఆలీ తెరకెక్కించిన రాక్ స్టార్ చిత్రంతో బాలీవుడ్ లోకి పరిచయం అయింది నర్గీస్ ఫక్రీ. ఈమె ఇండియన్ కాదు పుట్టింది అమెరికాలో, ఉన్నది మాత్రం పాకిస్థాన్లో అక్కడి నుండి ఇండియాకు తీసుకువచ్చారు ఇంతియాజ్ ఆలీ. ఇక తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నది నటి నర్గీస్.. ఈ ముద్దుగుమ్మ దూకుడు చూసిన తర్వాత ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు కానీ అవకాశాలు మాత్రం రాలేదట.

మద్రాస్ కేఫ్ ,మై తేరా హీరో, గూడఛారి , హౌస్ ఫుల్ వంటి సినిమాలు మినహాయిస్తే ఈమెకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు అని చెప్పవచ్చు. అయితే స్టార్ హీరోయిన్ కావలసిన తనను కొందరు కావాలనే తొక్కేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది నటి నర్గీస్.. బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే కచ్చితంగా దర్శకనిర్మాతలు కోరికలు తీర్చాలని తెలిపింది. అలా తనను కూడా కొంతమంది దర్శక నిర్మాతలు వాడుకోవాలని అడిగినట్లుగా తెలిపింది.

సినీ ఇండస్ట్రీలో వచ్చిన మొదట్లో ఎక్కడా కూడా ఇటువంటి విషయాల్లో కాంప్రమైజ్ కాకూడదని.. ముఖ్యంగా నగ్నంగా నటించకూడదని ఫిక్స్ అయినట్లుగా తెలియజేసింది. కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం తనని అదేపనిగా వేధించే వారని తెలిపింది. కొందరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తన స్థాయి హీరోయిన్ గా కాకుండా తొక్కేశారు అని తెలియజేస్తుంది.