ఆ విషయంలో హేమ భయపెడుతుందా..భయపడుతుందా..?

ప్రస్తుతం మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ డ్రగ్స్ ఇష్యూ. గత 24 గంటలుగా మీడియాలో ఈ విషయం పై పలు చర్చలు నడుస్తున్నాయి. ఆదివారం ఉద‌యం సుమారు 3 గంటల ప్రాంతంలో హైదరబాద్ లో బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో..ఎవ్వరు ఊహించని విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పార్టీలో ప‌బ్‌పై ఆక‌స్మాత్తుగా దాడి చేసి దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ మరో ఆశ్చర్య కర విషయం ఏమిటంటే.. ఈ పార్టీలో పలువురు బడా పోలిటికల్ స్టార్స్, సినీ సెలబ్రిటీస్ ప్ర‌ముఖుల పిల్ల‌లున్నారు. ఎవ్వరు ఊహించని విధంగా మెగా డాటర్ నీహారిక కూడా అక్కడ కనపడటం అందరిని షాకింగ్ కు గురి చేస్తుంది. ఇక అందరితో పాటే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కొద్ది సేపు విచారణ తరువాత షరతులతో ఆమెను ఇంటికి పంపిచిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ డ్రగ్స్ పార్టీలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్, టాప్ పొలిటీషియన్స్ పిల్లలు కూడా ఉండటం గమనార్హం. అయితే..మీడియాలో ఎవ్వరు ఊహించని విధంగా..అసలు అక్కడ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు తెర పైకి వచ్చింది. దీంతో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు హేమ.

ప్రెస్ మీట్ లో హేమ మాట్లాడుతూ..” కొందరు కావాలనే నా పేరుని చెడకొట్టడానికి..లేనిపోని నిందలు నాపై వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. అసలు నేను అక్కడ ఆ పార్టీలో లేను..మరి నా పేరు ఎలా చెప్తారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పిల్లలు డ్రగ్స్ తీసుకున్నంత మాత్రానా అందరు సెలబ్రిటీలు అలాంటి వారు అనడం న్యాయం కాదు. అక్కడ పట్టుబడ మొత్తం 150 మందిలో ఎంత మంది సినిమా వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలియనప్పుడు..మీడియాలో ఎలా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అని అంటారు. నిజంగా డ్రగ్స్ తీసుకునే వాళ్లని చెప్పుతో కొట్టాలి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . దీంతో కొందరు ట్రోలర్స్ హేమ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు..డ్రగ్స్ విషయంలో హేమ భయపెడుతుందని కొందరు అంటుంటే..కాదు కాదు భయపడుతుందని మరికొంత మంది అంటున్నారు.