యస్..ఇప్పుడు అందరూ ఇదే అనుకుంటున్నారు. జగన్ ఏం చేసినా ఓ పక్క ప్లానింగ్ తోనే చేస్తారు అంటుంటారు వైసీపీ నాయకులు. బహుశా ఏపీలో టికెట్ల ఇష్యూ పై జగన్ తీసుకున్న నిర్ణయాని చూసాకా అదే నిజం అనిపిస్తుంది. ఇక్కడ ధర్డ్ ఎంపైర్ అవసరమే లేదు..చూసేవాళ్లకి క్లీయర్ గా అర్ధమైపోతుంది…ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాడు అని.
నిన్న మొన్నటి వరకు ఏపిలో టికెట్ల రేటు పెంచండి మహా ప్రభో అంటూ అందరు నెత్తి నోరు మొతూకున్నా..రెస్పాండ్ అవ్వని జగన్..నేడు ఉన్నపాటుగా ఏపీలో టికెట్ రేట్లు పెంచుతూ..జీవోను సోమవారం రోజున విడుదల చేసింది. ఇది ఒక అందుకు సంతోషించే విషయం అయినా..కొందరు పవన్ అభిమానులు మాత్రం జగన్ చేసిన పని బాగోలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినిమా టికెట్ ధరల పెంపు పై చర్చలు జరుగుతున్నాయి..ఈ మధ్యనే పరిశ్రమలోని ప్రముఖులందరూ చిరంజీవి ఆధ్వర్యంలో స్పెషల్ గా వెళ్లి వై.ఎస్.జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకుని ..ప్రాబ్లం సాల్వ్ చేయమని ..జగన్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఈ మీటింగ్ జరిగి చాలా రోజులే అవుతుంది. అయితే జగన్ మాత్రం నిన్నటి వరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు.
కరెక్ట్ గా పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజైన 10 రోజులకు ఏపీలో టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేశారు. ఏపిల్లో టికెట్ల రేటు తగ్గించడం వల్ల పవన్ సినిమాకి ఎన్ని కోట్లు నష్టం వచ్చాయో మనకు తెలిసిందే. “ఇలా చేసి జగన్ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా పగ తీర్చుకున్నాను అనుకుంటున్నారు ఏమో..కానీ ఆయన పగను పెంచుకుంటున్నారు. పవన్ జగన్ మధ్య ఉన్న రాజకీయ సమస్యలని .. వృతి పరంగా కూడా పెంచుకుంటూ పరసనల్ లైఫ్ కి దెబ్బేసేలా తెచ్చుకుంటున్నారు “అంటూన్నారు పలువురు సినీ, రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి మళ్ళీ పవన్ నెక్స్ట్ సినిమాకి జగన్ టికెట్ల రెటును తగ్గిస్తాడు ఏమో..అంటూ పవన్ అభిమానులు సెట్టైర్ వేస్తున్నారు..?