ఒకేసారి అన్ని మిర‌ప‌కాయ‌లు క‌ర‌క‌రా న‌మిలిన ఎన్టీఆర్‌… షాక్ అయిన స్టార్ హీరోయిన్‌..!

తెలుగు సినిమా పరిశ్రమలో నట సార్వభౌముడు అని బిరుదును సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. అయితే ఈ బిరుదు వెనక ఎంతో కష్టం ఉందని చెప్పవచ్చు. ఇక తను నటించే సినిమాలలో ప్రతి పాత్రకు కూడా ప్రాణం పెట్టి మరీ నటిస్తారు. దీంతో ఆయనతో సినిమాలు తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు సైతం ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇక సినీ హీరోగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా కూడా ఎన్నో సినిమాలలో చేశారు. కొన్ని సన్నివేశాలలో ఎలాంటి డూప్ లేకుండా ఎన్నో సినిమాలలో రిస్కు చేస్తూ నటించాడు ఎన్టీ రామారావు.

అసలు విషయంలోకి వెళితే 1977వ సంవత్సరంలో ఎన్టీ రామారావు ఎదురీత అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటుచేసుకున్నది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వి. మధుసూదన రావు డైరెక్షన్ లో వాణిశ్రీ హీరోయిన్ గా ఎన్టీ రామారావు నటించిన చిత్రం ఎదురీత. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు. అయితే త ఈ సినిమా సన్నివేశాన్ని ఒక బీచ్ దగ్గర రన్నింగ్ చాట్ తీయవలసి ఉంది. అయితే నటీనటులందరూ పరుగు పెడుతున్నప్పుడు ఈ ఈ సన్నివేశాన్ని షూటింగ్ చేయాలట.

అంతలో కైకాల సత్యనారాయణ పరుగు పెడుతున్నప్పుడు.. ఇక ఎన్టీఆర్ కూడా పక్కనే వెళుతూ ఉండగా ఎన్టీఆర్ ముఖానికి ఒక ఇనప రాడ్ చాలా గట్టిగా తగిలిందట. దాంతో రక్తం కూడా రావడం జరిగింది.. దీంతో అది చూసిన అక్కడున్నవారంతా కంగారు పడ్డారు. కానీ అక్కడితో షూటింగ్ ఆపి ఎన్టీఆర్ తో పాటు అందరు ఆ నది ఒడ్డుకు వచ్చేశారు. అయితే రోడ్డు పక్కనే ఉన్న మిరప తోట లోకి వెళ్లి ఎన్టీరామారావు మిరపకాయలు ఎండినవి తీసుకొని.. నోటిలో వేసుకొని వచ్చాడట.

ఇదంతా గమనిస్తున్న హీరోయిన్ వాణిశ్రీ ఒక్క సారిగా షాక్ కు గురయింది. ఎన్టీరామారావు ఒకేసారి నాలుగు మిరపకాయలను నమిలిన తర్వాత పదండి షూటింగ్ కి అనడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ఎందుకు చేశారు అని అడగగా తగిలిన దెబ్బ తెలియకుండా ఉండడానికి ఎన్టీఆర్ ఇలా చేశారని తెలిపారు. ఇక దీన్ని బట్టే చూస్తే తెలుస్తుంది ఆయన సినిమాలకు ఎంత అంకితమయ్యారో.. !