ఆర్ఆర్ఆర్‌: అదే జ‌రిగితే మెగా ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్ట‌డం ఖాయం…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి తొలిసారి న‌టించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బడ్జెట్‌తో నిర్మించ‌గా, ఎం. ఎం. కీరవాణి స్వ‌రాలు అందించారు.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

చ‌రిత్రలో ఎన్న‌డూ క‌ల‌వ‌ని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ క‌లిసి ప్ర‌జ‌ల కోసం బ్రిటీష్ వారి ఎలా పోరాటం చేశారు అన్న క‌ల్పిత క‌థ‌తో రూపొందిన‌ ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ పాన్ ఇండియా మూవీ ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. అనేక వాయిదాల అనంత‌రం మార్చి 25న మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్రమోష‌న్స్ నిర్వహిస్తుండ‌గా.. మ‌రోవైపు ప్రీ రిలీజ్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జ‌రుగుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో చ‌ర‌ణ్‌కు రాజ‌మౌళి అన్యాయం చేశాడ‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దాదాపు డ‌బ్బై కోట్ల బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకున్న‌ ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో థ్రిల్ చేస్తుందని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే క్లైమాక్స్‌లో చ‌ర‌ణ్‌ను ఎన్టీఆర్ బాగా డామినేట్ చేస్తాడ‌ని, త‌న న‌ట‌న‌తో సినిమాను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్తాడ‌నే టాక్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

దీంతో మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర ప‌డుతున్నారు. ఎందుకంటే, ఇదో మ‌ల్టీస్టారర్ చిత్రం. ఇందులో ఏ హీరోను త‌క్క‌వ చేసి చూపించినా.. స‌ద‌రు హీరో అభిమానులు ఏ మాత్రం స‌హించ‌లేరు. ఇది రాజ‌మౌళికి బాగా తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ రిస్క్ తీసుకుని క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌ను ఎక్కువ చేసి చూపిస్తే మెగా ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్ట‌డం ఖాయం.