ఎన్టీఆర్ నోట జై బాలయ్య పాట.. తెగ నచ్చేసిందట..!!

కేవలం అభిమానులే కాకుండా ఇండస్ట్రీలో ఉండే బడా ప్రముఖులు సైతం ఎంతో ఈగర్ గా చూడాలని వెయిట్ చేస్తున్న మూవీ..”RRR”. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడం ఒక మెయిన్ రీజన్ అయితే,,కని విని ఎరుగని ఓ క్రేజీ కాంబో చరణ్-తారక్ ని సెట్ చేసి..అభిమానులను సాటిస్ఫై చేస్తూ సినిమాను తెరకెక్కించడం నిజంగా చాలా కష్టమైన పని. చాలా మంది డైరెక్టర్స్ కి ఆ ఆలోచనే వచ్చి ఉండదు..వచ్చినా..ఫ్యాన్స్ దెబ్బకు భయపడి..తమలో తామే ఆ ఆలోచనలు పెట్టుకుని ఉంటారు. అంత డేంజర్ ..ఎందుకంటే ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువ చేసి చూపించినా..చరణ్-తారక్ సైలెంట్ గా ఉంటారు ఏమో కానీ..ఫ్యాన్స్ ఊరుకోరు..నెట్టింట భీబత్సమైన ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు.

కాగా, ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో మనముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను మార్చి 25 వ తేదీన ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఢిఫరెంట్ గా ప్రమోషన్స్ ను చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చాలా ఇంటర్వ్యుల్లో పాల్గొన్న చరణ్-తారక్..రీసెంట్ గా సంగీత దర్శకుడు కీరవాణితో ఓ స్పెషల్ ఇంటర్వ్యుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోలు సినిమా గురించి ..అలాగే తమ పరసనల్ విషయాల గురించి..అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే కీరవాణి తారక్ ను నీకు ఇష్టమైన సింగర్ ఎవరు అని అడగ్గా.. ఆయన వెంటనే మోహన భోగరాజు..అలాగే గీతా మాధురి అంటూ చెప్పారు. అలాగే ఈ మధ్య గీతా మాధురి అఖండ సినిమాలో పాడిన “యా యా జై బాలయ్య” సాంగ్ లో ఆమె వాయిస్ టూ గుడ్..బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కీరవాణి తాను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరక్షన్ లో నచ్చని ఒక సాంగ్ చెప్పమని అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడా పాలు కవాల మురి పాలు కవాలా అంటూ వచ్చే సాంగ్ లో ముందు వచ్చే డింకిచక డింకిచకా ఆ పదాలు నచ్చలేదని ఓపెన్ గా చెప్పేసారు. ఈ ఇంటర్వ్యు చాలా సరదాగా దాపరికాలు లేకుండా కూల్ గా జరిగిపోయింది. మరి చూడాలి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..?