స్టార్ హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిన్నప్పటి నుండి..అక్కినేని అనే ట్యాగ్ ను వదిలేసింది. పెళ్లి తరువాత అందరు ఆమెని అక్కినేని ఇంటి కోడలు, అక్కినేని సమంత, కోడలు పిల్ల అంటూ సరదాగా పిలిచేవారు. అయితే , భర్తనే వద్దు అనుకున్నప్పుడు ఆ ఇంటి పేరు అవసరం లేదు అనుకుని..ఆ అక్కినేని ట్యాగ్ ను సోషల్ మీడియా నుండి..తన లైఫ్ నుండి రీమూవ్ చేసేసింది. కానీ,ఆ ఫ్యామిలీ మీద ఉన్న కోఫాని, ద్వేషానీ మాత్రం వదలలేదు అంటున్నారు నెటిజన్లు.
దానికి కారణాలు లేకపోనూలేదు. పెళ్లి తరువాత ఆల్ మోస్ట్ ఆల్ చాలా పద్ధతిగా కనిపించిన సమంత ..విడాకులు తీసుకోబోతున్నాం అని ప్రకటించిన వెంటనే ఆమె లో ని సెకండ్ షేడ్ చూయించిన్నట్లైంది. ఆమె వేసే బట్టలు..సెలక్ట్ చేసుకునే సినిమాలు..పెట్టే పోస్ట్లు..ప్రమోట్ చేసే బ్రాండ్ లు..ఇలా అన్నింటిలోను తేడాలు వచ్చేశాయి. దీంతో అక్కినేని అభిమానులు బాధపడ్డారు. కానీ సమంత లైట్ తీసుకున్నట్లుంది. ఎంత లైట్ అంటే గోవాలో టూ పీస్ బికినితో యోగాసనాలు వేస్తున్న వీడియోని రిలీజ్ చేసింది. అప్పట్లో ఈ మ్యాటర్ బాగా హాట్ గా నడిచింది.
అయితే తాజాగా ఆమె చేసిన పనులు వల్ల అక్కినేని కుటుంబానికి మరోసారి తలనొప్పులు వచ్చిన్నట్లు తెలుస్తుంది. విడాకుల తరువాత సైలెంట్ గా ఉన్న నాగచైతన్య, ఈ మధ్యనే కొంచెం యాక్టీవ్ అవుతూ..చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ గురించి ఆలోచించి..కొత్త బిజినేస్ స్టార్ట్ చేశాడు. షోయూ పేరుతో హైదరాబాద్లో సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే సరిగ్గా చై బిజినెస్ స్టార్ట్ చేసిన మూడు రోజులకే సమంత కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసింది. సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్లో ఆమె పెట్టుబడి పెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ప్రీ స్కూల్, సాకీ లాంటి బిజినెస్ ఐడియాలతో దూసుకుపోతున్న సామ్ మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టడం అదికూడా చై స్టార్ట్ చేసిన మూడు రోజులకే అనౌన్స్ చేయడంతో ..మీడియాలో మళ్లీ అక్కినేని పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో అక్కినేని కుటుంబానికి పెద్ద తలనొప్పిగా మారింది సమంత కొత్త బిజినెస్.