మహేష్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. #SSMB28 కు బ్రేక్..త్రివిక్రమ్ కొంప ముంచేశారుగా..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ వార్త నిజమే అనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఊహించని షాక్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న మహేష్..ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఒక్క వారం గ్యాప్ తీసుకుని..త్రివిక్రమ్ తో కమిట్ అయిన #SSMB28 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారమే తన పనులను ప్లాన్ చేసుకున్నాడు.

కానీ, సినీ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం .. #SSMB28 కు బ్రేక్ పడిన్నట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగుంటే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ ఆఖరి లో స్టార్ట్ చేసి.. మే నెలలో సగం సినిమాకు పై గా షూట్ కంప్లీట్ చేయాలని మహేష్ బాబు – త్రివిక్రమ్ అనుకున్నారట. ఆ విధంగానే ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశాడట త్రివిక్రమ్. కానీ, మహేష్ బాబు ఆ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారట. దానికి కారణం లేకపోనూ లేదు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలల్లో ఎండలు ఎలా మడిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఉదయం 10 దాటితేనే ఎండలు మండిపోతున్నాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు మే నెలలో భారీగా పెరిగే అవకాశాలున్నాయని వాతవరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మహేష్ మే నెల మొత్తం కూడా షూటింగ్‌కి దూరంగా ఉండాలని అనుకుని..ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటీకే దానికి సంబంధించిన అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నారట. సో.. సర్కారు వారి పాట షూటింగ్ ముగిసిన వెంటనే మహేష్ విదేశాలకు వెళ్లిపోతారు. దీంతొ #SSMB28 కు బ్రేక్ పడిన్నట్లే. మళ్లీ ఎప్పుడు వస్తాడొ..ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో ఎవ్వరికి తెలియదు ..!!