బాలయ్య డైరెక్టర్ తో ఎన్టీఆర్..కేకపెట్టించే కాంబో సెట్ చేసిన చరణ్ ప్రోడ్యూసర్..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ వార్త నిజమే అనిపిస్తుంది. రీసెంట్ గా RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్న ఈ నందమూరి వారసుడు..సినిమాలో తన పర్ ఫామెన్స్ తో చించేసాడు. ముఖ్యంగా మల్లి తో వచ్చే ఎమోషన్స్ సీన్లతో తారక్ ధియేటర్ కు వచ్చిన అందరి చేత కంట నీరు పెట్టించాడు. అంతలా ఆయన పాత్ర జనాలకు రీచ్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత తారక్ వరుస సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో #NTR 30 సినిమా లు కంప్లీట్ చేసి..ఆ వెంటనే సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చి బాబు తో మరో సినిమా ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు తారక్. ఇక ఆ తరువాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో పవర్ ఫుల్ సినిమా ను కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన తారక్..రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

F2, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన అనీల్ రావిపూడితో యంగ్ టైగర్ ఓ సినిమాను చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే తారక్ ను మీట్ అయిన అనీల్ తన స్టొరీని వినిపించగా..తారక్ కు ఆ కధ తెగ నచ్చేసిందని..వెంటనే ఈ సినిమా కు కమిట్ అయ్యాడని తెలుస్తుంది. కాగా ఈ మైండ్‌బ్లోయింగ్ కాంబోని సెట్ చేసింది ఎవరో తెలుసా..ఇంకెవరు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. కింగ్ లాంటి కాంబోలు సెట్ చేయడంలో ఆయన కు ఆయన సాటి..ఈ క్రమంలో జూ. ఎన్టీఆర్, అనిల్ రావిపూడి లతో తెరకెక్కే సినిమాను ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట . కాగా , చరణ్ -శంకర్ సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కాంబో తెర పై ఎలా పండుతుందో చూడాలి..?