మీరిద్దరు నన్ను చంపేస్తారా.. ప్రభాస్, కృష్ణంరాజు పై ఎన్టీఆర్ కామెంట్..?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే హిస్టోరికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా జోరు చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడం ఖాయం అన్న విధంగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో ప్రభాస్ ఫామిలీ నుంచి ప్రభాస్ పెద్దమ్మ శ్యామల కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

అప్పుడప్పుడు స్వయంగా ప్రభాస్ పెళ్లి గురించి స్పందించడం లాంటివి చేస్తూ అభిమానుల కు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు శ్యామల. అంతేకాదు ఇక ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామల ఇప్పటివరకు పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన శ్యామల ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్ నటించిన సినిమా లో ఏక్ నిరంజన్ సినిమా తనకు అస్సలు నచ్చదు అంటూ శ్యామల చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ సినిమా కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. అదేసమయంలో ప్రభాస్ కృష్ణంరాజు కూడా ఖర్చు విషయంలో అస్సలు రాజీపడరు అని చెప్పుకొచ్చారు శ్యామల.

ఇక అదే సమయంలో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని ఇటీవలే పంచుకున్నారు. బిల్లా మూవీ షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది. అక్కడ ఫుడ్ నచ్చుతుందో లేదో అని భావించి ఇక్కడి నుంచి ఒక కుక్ ను తీసుకెళ్లాం. అదే సమయంలో పక్కనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఎన్నో ఫుడ్ ఐటమ్స్ లను కలిపి పక్కన షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్కు క్యారేజ్ పంపించాడు.. ఇక ఆ సమయంలో మీ నాన్న కొడుకులు ఇద్దరు కలిసి నన్ను వదలరా.. ఫుడ్ పెట్టి చంపేస్తారా అంటూ ప్రభాస్ కృష్ణంరాజు పై కామెంట్ చేస్తూ ఎన్టీఆర్ తన ప్రేమను చూపించాడు అంటూ శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు.