తెలుగు సినిమా వాళ్లే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశ సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. రు. 450 కోట్లతో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. మూడేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించడంతో పాటు ఇద్దరు యంగ్ క్రేజీ స్టార్స్ రామ్చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక తారక్ అభిమానుల హంగామా అయితే మామూలుగా లేదు. ఇప్పటికే ఐదు వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఈ సినిమా దెబ్బతో తమ అభిమాన హీరో ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ పడుతుందని భావిస్తున్నారు. త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ అవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ తరం జనరేషన్ యంగ్ హీరోల్లో డబుల్ హ్యాట్రిక్ ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ రికార్డులకు ఎక్కుతాడు.
ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే ఓవర్సీస్ బుకింగ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఎన్టీఆర్ అభిమానులు ప్రీమియర్ షోల కోసం ఏకంగా థియేటర్లనే బుకింగ్ చేసేస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా 75 టిక్కెట్లు బుక్ చేసి. వాటి ఫొటో నెట్టింట్లో షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు మరో అభిమాని అయితే ప్రీమియర్ షోకు ఏకంగా ఒక థియేటర్ మొత్తాన్ని బుక్ చేసేశాడట.
ఫ్లోరిడా లోని టిన్సెల్ టౌన్ సాయంత్రం 6 షోకి మొత్తం థియేటర్ ని కొనేశారట. ఇప్పుడు ఇదే సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఎన్టీఆర్ దర్శనం కోసం తన అభిమానులు వేరే స్థాయిలో ఎదురు చూస్తున్నారని చెప్పాలి.