రాజమౌళితో సాన్నిహిత్యం.. నాకు మైనస్ గా మారింది అంటున్న ఎన్టీఆర్..?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేసిన నాటి నుంచి ఈ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయ్. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది అనే విషయం తెలిసిందే. అయితే ముందుగా 250 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ చివరికి 500 కోట్లు బడ్జెట్ అయ్యింది.

వెయ్యి కోట్ల టార్గెట్ తో త్రిబుల్ ఆర్ సినిమా బరిలోకి దిగబోతోంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం శరవేగంగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి దుబాయ్ లో కూడా ప్రమోషన్ చేసేసింది ఆర్ఆర్ఆర్ చిత్రబృందం. అందులో రాజమౌళి తారక్ చరణ్ హాజరయ్యారు. ఇక రాజమౌళి తో మీరు చాలా క్లోజ్గా ఉంటారు కదా అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి లో ఎప్పుడు ఫైర్ ఉంటుంది. కానీ నేను మాత్రం చలిలో వణుకుతూ షూటింగ్ చేశాను. ఆ ఒక్క విషయం వదిలేస్తే ఇక రాజమౌళి తో సాన్నిహిత్యం తనకు అన్ని విషయాల్లోనూ ప్లస్ పాయింట్ గానే ఉంది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

నటుడుగా తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం రాజమౌళి అంటూ తారక్ రాజమౌళి పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇకపోతే రాజమౌళి ఎన్టీఆర్ కెరీర్ దాదాపు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి.. జక్కన్న తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ కు రెండవ సినిమా. బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి యమదొంగ సినిమాలు అటు రాజమౌళినీ స్టార్ డైరెక్టర్ గా మార్చితే జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ సినిమా రాబోతుంది.