భీమ్లానాయ‌క్ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్‌… అక్క‌డ మాత్రం భారీ లాభాలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మాస్ మూవీ భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషీయ‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాకు సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌వ‌న్ స‌ర‌స‌న నిత్యామీన‌న్‌, రానాకు జోడీగా సంయుక్త మీన‌న్ న‌టించిన ఈ సినిమా మాసీవ్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక ప్ర‌భాస్ రాధేశ్యామ్ ఈ రోజు థియేట‌ర్ల‌లోకి దిగ‌డంతో ఈ సినిమా స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాల బాక్సాఫీస్ ర‌న్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో బాక్సాఫీస్ ర‌న్ దాదాపు పూర్తి చేసుకుంది. భీమ్లానాయ‌క్‌ ఓవర్సీస్ లో 2.42 మిలియన్ వసూళ్లు రాబట్టి ఆగిందట. దీనితో 2.5 మిలియన్ దగ్గర ఆగుతుంద‌ని అనుకున్న ట్రేడ్ వ‌ర్గాలు త‌మ అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గానే వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని అంటున్నారు.

ఓవ‌రాల్‌గా చూస్తే ఈ సినిమాకు ఓవ‌ర్సీస్‌లో ఇవి మంచి వ‌సూళ్లే అంటున్నారు. ఏపీలో కొన్ని ఏరియాల్లో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. అయితే భీమ్లా ఓవర్సీస్ లో అయితే లాభాల్లోనే ముగించాడని చెప్పాలి. ప‌వ‌న్ ప‌వ‌ర్ ఏంటో మ‌రోసారి ఈ సినిమాతో ఫ్రూవ్ అయ్యింది. ఏపీలో కూడా ప్రీమియ‌ర్లు, టిక్కెట్ రేట్ల‌కు ప‌ర్మిష‌న్లు ఉండి ఉంటే భీమ్లానాయ‌క్ మ‌రో రు. 10 కోట్ల షేర్ అద‌నంగా రాబట్టేది.