త్రిష చెన్నై చిన్నది… రెండు దశాబ్దాల క్రితం సినిమాల్లో ఓ మెరుపు కళ.. చూపు తిప్పుకోలేనంత అందం ఈ చిన్నదాని సొంతం. కోలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన త్రిష ఆ తర్వాత తెలుగులో తరుణ్ హీరోగా ఏఎం. రత్నం బ్యానర్లో వచ్చిన నీ మనసు నాకు తెలుసులో నటించింది. ఆ తర్వాత పదేళ్లకు పైగా తెలుగులో ఆమె ఫుల్ బిజీ అయిపోయింది. చిరు, నాగ్, పవన్, మహేష్ ఇలా వరుస పెట్టి స్టార్ హీరోలు ఆమెను తమ సినిమాల్లో రెండు, మూడు రౌండ్లు వాయి తిప్పేశారు. సీనియర్ హీరోలు, కుర్ర హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అందరికి త్రిషే కావాలి.. అటు కోలీవుడ్లోనూ అంతే.. ఏమైతేనేం పదేళ్ల పాటు సూపర్ హిట్లు అన్నీ త్రిష ఖాతాలోనే పడ్డాయి.
టాలీవుడ్ వారసుడు దగ్గుబాటి రానాతో త్రిష ఘాటుగా ఎఫైర్ నడిపింది అన్నది నిజం. వాళ్లిద్దరు కలిసి పబ్ల్లోనూ, క్లబ్ల్లోనూ చాలా సార్లు మీడియా కంట పడ్డారు. రానా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం అతడో ప్లే బాయ్.. త్రిష కూడా అతడు పెళ్లి చేసుకుంటాడని ప్రేమించి ఉండకపోవచ్చు. కట్చేస్తే 30 + ఏజ్ వచ్చాక చెన్నైకు చెందిన పెద్ద పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్తో ప్రేమ, ఎంగేజ్మెంట్.. త్వరలోనే పెళ్లి అనుకున్నారు.
ఉంగరాలు మార్చుకున్నారు. సడెన్గా ఏదో జరిగింది. ఒకరి ఉంగరాలు మరొకు వెనక్కు ఇచ్చేసుకున్నారు. త్రిష తన సోషల్ మీడియా అక్కౌంట్లలో ఎంగేజ్మెంట్ ఫొటోలు తీసేసింది. అప్పుడే అనుమానం.. చివరకు పెళ్లి లేదని క్లారిటీ ఇచ్చేసింది. లోపల ఏం జరిగిందో కాని.. బయటకు మాత్రం పెళ్లి తర్వాత త్రిషను సినిమాలు మానేయాలని కండీషన్ పెట్టడంతో నచ్చకే ఆమె బ్రేకప్ చెప్పేసిందని అన్నారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ తర్వాత త్రిష తిరిగి సినిమాల్లోకి వచ్చి సూపర్ హిట్లు కొడుతోంది.. ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది.
వరుణ్ కూడా త్రిష మోసం చేసిందని ఏవో ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక హీరోయిన్ బిందు మాధవితో వరుణ్ డేటింగ్లోకి వెళ్లిపోయాడు. అయితే బింధు మాధవితో మాత్రమే కాదు మరి కొందరు అమ్మాయిలతో అతడి స్నేహాలు, తిరుగుళ్లు నచ్చకే త్రిష బ్రేకప్ చెప్పేసిందని కూడా అంటారు. ఇక ఇప్పుడు త్రిష సినిమాల్లో బిజీగా ఉంటూ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం కోలీవుడ్ సీనియర్ హీరో శింబుతో ఆమె పెళ్లి జరగబోతోందని గట్టిగా కోలీవుడ్లో టాక్ వినిపించింది.