కోట్లాది మంది అభిమానుల అంచనాలను..కలలను నిజం చేస్తూ..దర్శక ధీరుడు రాజమౌళి మరో బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ బడా హీరోలైన తారక్-చరణ్ లను పెట్టి “రణం రౌద్రం రుధిరం” అంటూ ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ గా పరుగులు తీస్తుంది.
సినిమాలో నవ్వడానికి పెద్ద స్కోఫ్ లేకపోయినా..స్లో గా ఉన్నా కానీ..రాజమౌళి తందైన స్టైల్ లో తెరకెక్కించి.. విజువల్ ఎఫెక్ట్స్ తో అభిమానులను ఫిదా చేశాడు. ఇద్దరు హీరోలను పెట్టి సినిమా తీయ్యడం చాలా కష్టమైన విషయమే. ముఖ్యంగా ఫ్యాన్స్ ను మెప్పించడం అసాధ్యం. కానీ అలాంటి అసాధ్యాని సుసాద్ధ్యం చేశాడు జక్కన్న. తారక్-చరణ్ లకు ఇద్దరికి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తూ..కధను ముందుకు నడిపించాడు. కానీ సినిమా తారక్ రోల్ చాలా చిన్నది అని చరణ్ నే సినిమాలో హైలెట్ చేశాడని..అంటున్నారు అభిమానులు.
ఇక ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీం సంబరాల్లో మునిగితేలుతోంది. కాగా ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో.. శనివారం ఓ గ్రాండ్ సక్సెస్ పార్టి పెట్టుకున్నారు. ఈ పార్టీకి దర్శకుడు రాజమౌళితో పాటు రాంచరణ్, ఎన్టీఆర్, ఎస్ఎస్ కార్తికేయ, దిల్ రాజు, ఉపాసనతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఈ పార్టీలో గత కొంత కాలంగా మీడియాకి ముఖం చూపించకుండా వస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తలుక్కున మెరిసింది. టాలీవుడ్ జేజేమ్మ గా తన నటనతో మనల్ని మెప్పించిన ఈమె గత కొంత కాలంగా సినిమాలకు మీడియాకి దూరంగా ఉంటూ వస్తుంది. ఇక సడెన్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో అనుష్క కనిపించదంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పార్టీలో రాంచరణ్తో అనుష్క మాట్లాడుతున్న స్టిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా అనుష్క గతంలో రాజమౌళి డైరెక్షన్ లో రవితేజ తో విక్రమార్కుడు..ప్రభాస్ తో బాహుబలి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్లో మూడు సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో స్వీటీ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.