ధనుష్ పై రివేంజ్ స్టార్ట్.. ఐశ్వ‌ర్య సంచలన నిర్ణయం..?

ఐశ్వ‌ర్య రజనీకాంత్ .. ఈ మధ్య కాలంలో ఎక్కువుగా మీడియాలో వినిపిస్తున్న పేరు. తన భర్త కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో విడాకులు తీసుకుని వేరు వేరు గా బ్రతకాలి అనుకుంటున్నాం అంటూ ప్రకటించినప్పటి నుండి ఆమె పేరు మీడియాలో ఏదో రకంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ధనుష్ లాంటి స్టార్ హీరో కూడా భార్యకు విడాకులు ఇవ్వడం ఏంటి అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బడా సెలబ్రిటీస్ అయిన మీరే ఇలాంటి పనులు చేస్తూ..సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటు సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.

ఈ క్రమంలోనే వీళ్ల ఇద్దరి విడాకులు తిసుకొవడానికి గల కారణాల గురించి చర్చించుకుంటున్నారు. కొందరేమో ధనుష్ కు గర్ల్ ఫ్రెండ్ ఉందని..ఆమె మోజులోనే బంగారం లాంటి భార్యను వదులుకున్నాడని అంటున్నారు. దానికి తగ్గట్లే ఆయన ఈ మధ్య ఓ అమ్మాయితో పబ్లిగానే రెస్టారెంట్ కి వెళ్ళి పక్క పక్కనే కూర్చోని మరీ ఫుడ్ తిన్నారు. ఆ ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. ఆ ఫోటోలు పెద్ద దుమారానే రేపాయి. కాగా, ఇప్పుడు ఆయన చేసిన పనికి తన మాజీ భార్య ఐశ్వర్య..మైండ్ బ్లాకింగ్ షాక్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యిన్నట్లుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.

గతంలో ఐశ్వ‌ర్య స్టార్ హీరో శింబుని ప్రేమించిందని,పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకుందని..వాళ్ళకి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ రజనీకాంత్ కి ఇష్టం లేకపోవడం వల్ల శింబుతో బ్రేకప్ చెప్పేసుకుందట. కాగా ఇప్పుడు ధనుష్ తో డైవర్స్ అయ్యాక..మళ్ళీ శింబుతో చేతులు కలపనున్నట్లు తెలుస్తుంది. శింబు తో ఐశ్వ‌ర్య ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌ను తెరకెక్కించడానికి ప్లాన్ రెడీ అయ్యిందట. ఈ మధ్యనే ఐశ్వర్య చెప్పిన స్టోరీ శింబు వినగా బాగా నచ్చేసి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రం నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది . ఒక్కవేల ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఐశ్వర్య ధనుష్ మీదే రీవెంజ్ తీర్చుకొవడానికే ఇలా తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి సిద్ధమైంది అంటున్నారు నెటిజన్లు. ధనుష్ వేరే అమ్మాయితో తిరిగితే..ఐశ్వర్య ఏకంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో మళ్లి చేతులు కలపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.