వరస అవకాశాలు ఇచ్చి నిత్య మీనన్ ని ఆదుకుంటున్న టాలీవుడ్ హీరోలు..

నేటి రోజుల్లో హీరోయిన్లందరూ కూడా అందాలు ఆరబోస్తూ వరుస అవకాశాలు అందుకుంటూన్న నేటి రోజుల్లో ఇప్పటికీ అభినయానికి నటనకు ఆస్కారమున్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది నిత్యామీనన్. కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా తన టాలెంట్ను రుజువు చేసుకుంటుంది. వరుస అవకాశాలు రాకపోయినా పర్వాలేదు స్టార్ హీరోయిన్ గా భారీ పారితోషికం తీసుకోకపోయినా పర్వాలేదు.. కానీ మనసుకు నచ్చిన ప్రేక్షకులు మించిన పాత్రలు మాత్రమే చేస్తాను అంటూ చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నిత్యామీనన్ మరికొన్ని రోజుల్లో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది అన్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన అయ్యప్పనుమ్ కోషియన్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలో కీలకపాత్రల్లో పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు జోడీగా అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ నటిస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కాబోతుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అంతేకాదు ఏ సినిమాకూ లేనంతగా ఈ సినిమా అంచనాలను పెంచేస్తుంది అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో స్టార్ హీరోలకు జోడిగా కనిపించిన ప్రతిసారి నిత్యమీనన్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తమిళ్ హీరో సూర్య నటించిన 24 లో కూడా హీరోయిన్గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక జనతా గ్యారేజ్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది నిత్యామీనన్. ఇక అదిరింది సినిమాలో ఇళయదళపతి సరసన నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటుంది నిత్యమీనాన్. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. దీంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.