బీమ్లా నాయక్ సినిమాను మిస్ చేసుకున్నదురదృష్టవంతుడు ఎవరో తెలుసా..?

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడైనా సరే ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు పవన్ కళ్యాణ్ తో ఒక్కసారైనా సినిమా తీయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఇండస్ట్రీకి కొత్త గా ఎంట్రీ ఇచ్చే దర్శకులు పవన్ కళ్యాణ్తో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఇక అంతకంటే అదృష్టం ఏముంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి పవర్ స్టార్ తో సినిమా చేస్తే ఊహించని రేంజ్ లో క్రేజ్ వచ్చి పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్గా ఎదగొచ్చు.

కానీ ఇక్కడ ఒక యువ దర్శకుడు మాత్రం పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ నో చెప్పేశాడట. అయితే ఇలా ఆ దర్శకుడు నో చెప్పడానికి కారణం నాచురల్ స్టార్ నాని అన్నది తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం యువ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ తెరకెక్కింది. కోలీవుడ్ మూవీ అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకు తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా సాగర్ కే చంద్ర ఉన్నప్పటికీ అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే సినిమా మొత్తం తెరకెక్కింది. ఇప్పుడు టాలీవుడ్ లో భీమ్లా నాయక్ సృష్టిస్తున్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దర్శకుడు సాగర్ ను సెలెక్ట్ చేసింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కానీ అంతకు ముందు ఈ సినిమా కోసం వివేక్ ఆత్రేయ ను సెలెక్ట్ చేశాడట త్రివిక్రమ్. అప్పటికే బ్రోచేవారెవరురా మెంటల్ మదిలో లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు వివేక్ ఆత్రేయ. ఈ యువ దర్శకుడు టేకింగ్ నచ్చడంతో ఇతనే భీమ్లా నాయకుడు దర్శకుడిగా పెట్టుకోవాలని అనుకున్నాడట. కానీ అప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అతనికి అడ్వాన్స్ ఇవ్వడం తో నానితో అంటే సుందరానికి సినిమా చేయాల్సి ఉంది. దీంతో ఇష్టం లేకపోయినప్పటికీ యువ దర్శకుడు భీమ్లా నాయక్ ఛాన్స్ వదులుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది.