మాస్ మహారాజ్ ‘ఖిలాడీ ‘ ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్లో కామెడీతో ఎంటర్టైన్మెంట్ చేసే అతితక్కువ హీరోలు ఉంటె అందులో మొదటి వరసలో ఉండేది మాత్రం మాస్ మహారాజ రవి తేజ .అయన సినిమాలో కమిడియన్ తో పాటు సమానంగా కామెడీ ట్రాక్ ఉంటది .రవి తేజ సినిమాలో ఎక్కువ సినిమాలు ఆలా హిట్ అయినవే. రవి తేజ ఇప్పుడు వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .

పెన్ ప్రొడక్షన్ లో రమేష్ వర్మ ,సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో రమేష్ వర్మ దర్శకత్వంలో రవి తేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ‘ఖిలాడీ ‘. ఈ రోజు ఖిలాడీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం .ఈ సినిమాలో ప్రధాన కధ డబ్బు చుట్టే తిరుగుతుంది .ఈ ట్రైలర్ లో సినిమా కధ లైన్ చూస్తే ఒక వంద కోట్లు చుట్టూ ఖిలాడీ కధ తిరుగేటట్టు ఉన్నది .ఇంతకీ ఆ డబ్బు ఎవరది ? ఎవరు చేతికి దొరికింది ? ఆ తరువాత స్టోరీ ఏమైంది అనేదే కధ ప్రధానాంశం .

ఈ ఖిలాడీ లో డింపుల్ హయతి హీరోయిన్గా ,యాక్షన్ హీరో అర్జున్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు .ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సుజిత్ వాసుదేవ్ సినెమాట్రోగ్రఫీ అందించగా ,రమేష్ వర్మ మాటలు అందిస్తున్నారు .ఈ ఖిలాడీ సినిమా ఈ నెల 11 విడుదల అవుతుంది.