అయ్యో అయ్యో అయ్యాయో..దేవిశ్రీప్రసాద్ వాళ్ళను నిలువునా ముంచేసాడే..?

దేవిశ్రీప్రసాద్.. అబ్బో ఒకప్పుడు ఈ పేరు చెప్పితే జనాలు అదేదో పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోయేవారు. అలాంటి ట్రెండ్ సెట్ చేసుకున్నాడు దేవి. ఈయన మ్యూజిక్ చేస్తే ఆ సినిమా హిట్..స్టేజీ పై పాట పాడితే స్టార్స్ సైతం చిందులేయ్యాల్సిందే. ఒకానోక టైంలో టాలీవుడ్ ని దేవిశ్రీప్రసాద్ ఏలేసాడు అనే చెప్పాలి. తనదైన స్టైల్ లో పాటలు కంపోజ్ చేస్తూ..యువతను అమితంగా ఆకట్టుకున్నాడు. ఆయన మ్యూజిక్‌ వింటే ఎవరికైనా స్టెప్పులేయాలనిపిస్తుంది. రొమాంటిక్‌, సెంటిమెంటల్‌, దుమ్మురేపే మాస్‌ బీట్స్‌, హుషారెత్తించే ఐటమ్స్‌ సాంగ్స్‌.. ఏదైనా తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు.

కేవలం 19 ఏళ్ల వయసులోనే సంగీతం అంటే ఇష్టంతో ఈ మ్యూజిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. తన టాలెంట్ చూయిస్తూ అందరిని తన మ్యాజిక్ మ్యూజిక్ తో మెస్మరైస్ చేసి..టాలీవుడ్ నెం 1 మ్యూజిక్ డైరెక్టర్ గా కొన్ని సంవత్సరాళ్లు కొనసాగాడు. కానీ, పేరుగుతున్న ఈ కాంపీటీషన్ యుగంలో దేవి ఎందుకో వెనుకపడిపోయారు. ఇప్పటికి సినిమాలు చేస్తున్నా..కానీ అప్పటి దేవి మాత్రం కనపడటం లేదు అంటున్నారు అభిమానులు. రీసెంట్ గా పుష్ప సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఆయన..ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా అంటూ అద్దిరిపోయే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేసి మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక దేవి మళ్ళీ ఫాం లోకి వచ్చాడులే అని అనుకునే లోపే బిగ్ షాక్ ఇచ్చారు.

అయితే, తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దేవిశ్రీ ప్రసాద్ కొన్ని నెలలు తెలుగు సినిమాలకి సంగీతం చేయడట. బాలీవుడ్ మేకర్స్ కూడా ఈ రాక్ స్టార్‌ను ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే.. దీంతో బాలీవుడ్ బడా హీరో నటిస్తున్న సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే ఛాన్స్ అందుకున్నారట. అయితే, ఈ సినిమాను మేకర్స్ కేవలం రెండు మూడు నెలల్లోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుని మరీ అగ్రీమెంట్ రాయించుకున్నారట. దీంతో డీఎస్పీ ఇక కొన్ని నెలలు ముంబైలోనే మకాం వేయనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వర్క్ అయ్యేంత వరకు దేవి అక్కడే ఉంటారట. ఇక ఆ సినిమా పనులు పూర్తి అయ్యాకనే పుష్ప 2, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది.