టాలీవుడ్లో విడాకులు తీసుకుంటున్న మరో క్రేజీ డైరెక్టర్ … !

గత రెండేళ్లలో కరొనతో ఎన్నో కుటుంబాలు కకాలికం అయ్యాయి .ఒక పక్క కరొనతో చింద్రం అవుతుంటే , మరో పక్క కలహాలతో డివోర్స్ అనే వైరస్ తో కుటుంబాలు నాశనం అవుతున్నాయి . గత ఇయర్ లో ఎంతో అన్యోన్యంగా కనిపించిన నాగచైతన్య-సమంత విడిపోవడం మొదలుపెట్టి ఇటీవలే ధనుష్-ఐశ్వర్య 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతున్నట్లు ప్రకటించడం మరో షాక్. ఇంకా ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్లో మరో సెలబ్రెటీ విడాకుల గురించి సమాచారం బయటికి వచ్చి ఇండస్ట్రీలో కలకం రేపింది .

టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పెళ్ళిచూపులు’ సినిమాతో పరిచయం అయిన తరుణ్ భాస్కర్., తరుణ్ -లతలది ప్రేమ వివాహం . తన భార్య లత నుంచి విడిపోయినట్లు సమాచారం ఇండస్ట్రీలో ఈ వార్త చక్కెర్లు కొడుతుంది . అయితే వీళ్లిద్దరూ అధికారికంగా విడాకులు ప్రకటించలేదు .. ఇద్దరూ విడిగా ఉంటున్నట్లు టాలీవుడ్ల్ లో టాక్ . ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో చూసింది తరుణ్ వ్యక్తిగత జీవితాన్నే. అందులో అనీషా ఆంబ్రోస్ చేసిన పాత్ర.. నిజ జీవితంలో లత జీవితం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నదే.

ఫ్యాషన్ డిజైనర్ అయిన లత తో తరుణ్ భాస్కర్ డైరెక్టర్ అవకముందే ఇద్దరకీ పెళ్లి అయింది .తరుణ్ చాలా ఇంటర్వ్యూల్లో తన భార్య లత గురించి చాలా గొప్పగా చెప్పాడు . తరుణ్ సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో కూడా చాలాసార్లు లత కనిపించింది. అతడి సినిమాల మేకింగ్‌లో కూడా ఆమె పాత్ర కీలకం. ఈ జంట విడిపోవడం వారి సన్నిహితులకు కూడా షాకింగే. ఐతే ఈ విషయాన్ని తరుణ్, లత అధికారికంగా ప్రకటించలేదు.