ఐదేళ్ల క్రితం ఓ మళయాళ స్టార్ హీరోయిన్ మీద జరిగిన లైంగీక దాడి విషయం యావత్ దేశాన్ని ఊపు ఊపేసింది. ఆ కేసులో అరెస్టు అయ్యింది ఓ స్టార్ హీరో కావడంతో ఆ సంఘటనకు అప్పట్లో పెద్ద ప్రయార్టీ లభించింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ అందరూ దాని గురించే చర్చించుకున్నారు. ఈ దాడి కేసులో వార్తల్లోకి ఎక్కింది ఎవరో కాదు మళయాళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న దిలీప్. దీలీపే సదరు హీరోయిన్పై దాడి ప్లాన్ చేయించాడని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ కేసులో అతడు అరెస్టు కావడంతో పాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఆ తర్వాత మనోడు ఎంచక్కా బెయిల్పై బయటకు వచ్చి సినిమాలు చేసుకుంటున్నాడు.
దిలీప్ ఆదేశాల మేరకే పల్సర్ సుని అనే ఒక కిరాయి గూండా సదరు కథానాయికను కిడ్నాప్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కారులోనే తిప్పుతూ ఆమెపై లైంగీక దాడికి పాల్పడడంతో పాటు మానసికంగా కూడా ఆమె కుంగిపోయేలా చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ దాడి తర్వాత ఆ హీరోయిన్కు కేవలం మళయాళ ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. దిలీప్ పెద్ద విలన్గా మారిపోయాడు. ఈ కేసులో అతడు తప్పించుకోవడం అసాధ్యం అని.. అతడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందనే అందరూ అనుకున్నారు.
అలాంటిది జరగలేదు సరికదా .. దిలీప్ ఇప్పుడు బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. ఈ కేసులో జడ్జి కూడా పక్షపాతంలో ఉన్నాడన్న సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సదరు హీరోయిన్ ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై ఏకంగా సీఎం పనరయి విజయన్కే లేఖ రాసిందట. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. సదరు నిందితుడు ధన బలం కూడా చూపిస్తున్నాడని.. నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిందట.
సీఎం వెంటనే జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరడంతో ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ సారి విచారణలో ఏం జరుగుతుందా ? అన్న ఆసక్తి ఉంది. దీనిపై సింగర్ చిన్మయి కూడా స్పందించింది. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల్లో ఎప్పుడూ ఇలాంటి అన్యాయాలే జరుగుతున్నాయని ఆమె వాపోయింది.