ఇప్పటికే 5.. ఇప్పుడు మరో మూడు.. ప్రభాస్ తగ్గేదేలే?

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అన్నది తెలిసిందే. ఇక బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలే కావటం గమనార్హం. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీ బిజీగా మారిపోతున్నాడు ప్రభాస్. ఇక వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేయబోతున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కె సహ స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్.

 

ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. ఇప్పటికే వరుస షూటింగ్ లతో బిజీ బిజీ ఉన్న ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఇంకా ఎంతో మంది దర్శకులు కూడా సిద్ధమవుతున్నారట. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుని సినిమాలతో రికార్డులు తిరగ రాయాలి అని అనుకుంటున్నారట. దీంతో ఎన్నో స్టోరీలతో ప్రభాస్ సంప్రదిస్తూ ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇప్పటికే ఐదు సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఇక మరికొన్ని ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు కొత్తగా మరో మూడు సినిమాలకు పచ్చజెండా ఊపేశారు ఈ పాన్ ఇండియా స్టార్.

 

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించబోతున్న సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.. ఈ సినిమా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తో సినిమా చేసేందుకు కూడా ప్రభాస్ ఓకే చెప్పేశాడట. దీనికోసం మారుతి హారర్ కామెడీ స్టోరీ ప్రభాస్కు వినిపించగా దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. ప్రభాస్ దానయ్య మారుతి కాంబినేషన్లో వచ్చే సినిమాకి రాజా డీలక్స్ అని పేరు కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త సినిమా పట్టాలెక్కించే ఆలోచన లో కూడా ఈ పాన్ ఇండియా స్టార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం గా 8 సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్.