యంగ్ హీరో గ్యారేజీలోకి లేటెస్ట్ మోడల్ బెంజ్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

సినిమా పరిశ్రమలో చాలా మంది నటీనటులు లగ్జరీ కార్లు వాడుతుంటారు. మరికొంత మంది లగ్జరీ బైకులు సైతం తీసుకుంటారు. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి విడుదలయ్యే కొత్త కార్లను తమ గ్యారేజీలోకి తెచ్చుకునేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా ఎన్టీఆర్, రాంచరణ్ సహా పలువురు కొత్త కార్లను తెచ్చుకున్నారు.అదే లిస్టులో చేరాడు సాయి కుమార్ తనయుడు ఆది.

తాజాగా ఈ యంగ్ హీరో జర్మనీకి చెందిన లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ ను కొనుగోలు చేశాడు. తాజాగా దీనిని సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆది ఫాదర్ సాయి కుమార్ తో పాటు ఆయన భార్య, కూతురు ఉన్నారు. బెంజ్ ఫ్యామిలీలో చేరడం సంతోషంగా ఉందన్నాడు ఈ యంగ్ హీరో.

లేటెస్ట్ మోడల్ బెంజ్ కారు విలువైనదే. దీనికి అత్యాధునికి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ ఎక్టీరియర్ ఫీచర్స్, ఇంటీరియర్స్ ఫీచర్స్ ఉన్నాయి. డిజైన్ కూడా ఓ రేంజిలో ఉంది. బెంజ్ లోగోతో పాటు అద్భుతమైన గ్రిల్ ది. ఇందులో స్టీరింగ్ వీల్, అందులోనే కంట్రోల్ ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ అదుర్స్ అనేలా ఉంది. మంచిసెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అటు ఆది ప్రస్తుతం అనుకున్న స్థాయిలో సినిమాలు చేయడం లేదు. ఆయన నటించిన అతిథి దేవోభవ సినిమా కాస్త ఫర్వాలేదు అనిపించింది. లవ్, యాక్షన్ సినిమా తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు. అటు బుల్లి తెర మీద ఆయనకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈయన సినిమాలకు సంబంధించి శాటిలైట్ రైట్స్ బాగానే అమ్ముడు అవుతున్నాయి. తాజాగా ఈయన కారు కొనుగోలు చేయడంతో అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని ఖరీదు రూ. 50 లక్షలకు పైమాటే అనే టాక్ నడుస్తుంది.