నిన్ను చంపేస్తా.. భార్య ప్రణతికి ఎన్టీఆర్ వార్నింగ్‌.. ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ‌గ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `నిన్ను చంపేస్తా..` అంటూ భార్య లక్ష్మీ ప్రణతికి వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. నిజానికి ఎన్టీఆర్ త‌న సినీ కెరీర్‌కు ఎంత ప్రాధాన్య‌త‌ను ఇస్తాడో.. అంత‌కంటే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఫ్యామిలీకి ఇస్తాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు. మ‌రి అటువంటి వ్య‌క్తి భార్య‌కు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న‌ది తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.

ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహమనే విషయం తెలిసిందే. 2011 మే 5న వీరి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరికి అభయ్‌రామ్‌, బార్గవ రామ్‌ ఇద్దరు కుమారులు. అయితే ఎన్టీఆర్ ర‌భ‌స సినిమా చేస్తున్న సమ‌యంలోనే ప్ర‌ణ‌తి గ‌ర్భ‌వ‌తిగా ఉంది. ఆ టైమ్‌లో భార్య‌తోనే ఉండి ఆమెను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని ఎన్టీఆర్ అనుకున్నాడ‌ట‌.

కానీ, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ర‌భ‌స షూటింగ్ కోసం ఎన్టీఆర్‌ స్విట్జర్లాండ్ వెళ్లాల్సి వ‌చ్చింది. ఇక షూటింగ్ సమయంలో కూడా తన భార్యతో వీడియో కాల్ చేసి మాట్లాడేవాడట. అలా ఓసారి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ప్ర‌ణ‌తిలో కొంచెం తేడా కనిపించ‌ద‌ట‌. దాంతో ఖంగారు ప‌డిన‌ ఎన్టీఆర్ `నిన్ను చంపేస్తాను.. నేను ఇక్కడే ఉన్నాను..నువ్వు అప్పుడే కనేయ్యకు.. నేను వచ్చేసరికి ఆగు` అనేసరికి.. లేదులే బాగానే ఉంద‌ని ప్ర‌ణ‌తి చెప్పింద‌ట‌.

అయినా ఎన్టీఆర్‌కు ఖంగారు పోలేద‌ట‌. కొంత స‌మ‌యం త‌ర్వాత మ‌ళ్లీ కాల్ చేయ‌గా.. హాస్పిటల్ కు వెళ్తున్నానని చెప్పింద‌ట‌ ప్ర‌ణ‌తి. అయితే ఎన్టీఆర్‌ టెన్ష‌న్ ప‌డ‌కుండా ఉండేందుకు చ‌క‌ప్ కోస‌మే వెళ్తున్నా అని ఆమె అబ‌ద్ధం చెప్పింది. కానీ, అప్ప‌టికే భార్య ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్‌.. వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కి చేరుకున్నాడ‌ట‌. అయితే అప్ప‌టికే ప్ర‌ణ‌తి అభయ్‌రామ్‌కి జ‌న్మ‌నిచ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని గ‌తంలో ఎన్టీఆర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కాగా, ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కాబోతోంది.