మృత్యువుతో పోరాడి గెలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే?

సినీ ఇండస్ట్రీలో నటీనటులు తమ అభిమానులను ప్రేక్షకులను మెప్పించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారికి కష్టమైనా సరే వాటిని ఇష్టంగా భరిస్తూ, సినిమాలలో నటిస్తూ ఉంటారు. అలా జీవితంలో మృత్యువుతో పోరాడి కూడా ప్రాణాలు నిలబెట్టుకున్న సెలబ్రిటీలు ఎందరు ఉన్నారు. మృత్యువుతో పోరాడి ప్రాణాలు నిలబెట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల గురించి తెలుసుకుందాం..

షీలా కౌర్ : అల్లు అర్జున్ తో కలసి పరుగు సినిమాలో నటించిన హీరోయిన్ షీలా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడే ప్రాణాలతో బయట పడింది.

మమతా మోహన్ దాస్: 25 సంవత్సరాలు కూడా నిండని ముందే ఈమె బ్లడ్ క్యాన్సర్ బారినపడి పోరాడి మరి చివరకు బ్లడ్ క్యాన్సర్ నుంచి తన ప్రాణాలు దక్కించుకుంది. ఈ వ్యాధి తగ్గినట్టే తగ్గి మరొకసారి తనపై పంజా విసరడంతో ఆమె మళ్లీ పోరాడి ప్రాణాలు నిలబెట్టుకుంది .

మనీషా కొయిరాలా: ఈమె సర్వైకల్ క్యాన్సర్ తో పోరాడే తన ప్రాణాలు నిలబెట్టుకుంది.

సోనాలి బింద్రే: మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన ఈ బ్యూటీ తిన్నావా మతాలను ఎదుర్కొంది. ఆ క్షణంలోనే ఆమె భయపడి గుండె నిబ్బరం చేసుకొని ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాడి దాని నుంచి బయట పడింది.

గౌతమి: బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని, మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకుంది.