ఏనుగులు.. వాటి భారీ కాయాన్ని చూసి ఎక్కడ తొక్కి చంపేస్తాయో అని అందరూ తెగ భయపడుతుంటారు. కానీ, నిజానికి మానవులతో అత్యంత సన్నిహితంగా మెలిగే జంతువులలో కుక్క తరువాత ఏనుగే అని చెప్పాలి. మనుషులకు, ఏనుగులకు మధ్య కెమెస్ట్రీ కుదిరితే.. అవి అస్సల మనల్ని వదిలి పెట్టవు.
ఇక తాజాగా ఓ ముగ్గురు కుర్రాళ్లు ఏనుగులతో స్కిప్పింగ్ ఆడారు. అవును, మీరు విన్నది నిజమే. రెండు ఏనుగులను ఎదురెదురుగా కొంచెం దూరంగా నిలబెట్టాడు. ఆ రెండు ఏనుగుల తొండాలకి మధ్య తాడు కట్టాడు. ఆ ఏనుగులు ఆ తాడుని ఆడిస్తుంటే మరాఠీకి చెందిన ముగ్గురు కుర్రాళ్లు స్కిప్పింగ్ జంప్స్ చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు లేటూ మీరు ఆ వీడియోపై ఓ లుక్కేసేయండి.
https://twitter.com/hussain_tarana/status/1439111736242544643?s=20