శిల్పాశెట్టి కుటుంబంపై పగబట్టిన నటి..!!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా పై ప్రముఖ మోడల్ అలాగే నటి షెర్లిన్ చోప్రా పగబట్టింది.. ఇకపోతే పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇరుక్కుని, కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత రీసెంట్గా బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇకపోతే నటి షెర్లిన్ తన పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేశారు అంటూ శిల్పాశెట్టి అలాగే రాజ్ కుంద్రా దంపతులపై ఆమె 50 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్లీ శిల్పా శెట్టి దంపతులపై ఎదురుదాడికి దిగింది..

Sherlyn Chopra Files Complaint Against Shilpa Shetty & Raj Kundra; Couple  Reacts
తనను మానసికంగా వేధించినందుకు 75 కోట్ల రూపాయలు అడుగుతూ.. శిల్పా శెట్టి దంపతులకు నోటీసులు పంపించింది.. రాజ్ కుంద్రా తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడు అంటూ..ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇకపోతే తమపై ఆరోపణలు చేస్తోంది అంటూ రాజ్ కుంద్రా తో పాటు ఆయన భార్య శిల్పాశెట్టి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈమె పై లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు.. ఇక వీరిపై రివర్స్ లో శిల్పా శెట్టి దంపతులపై ఆరోపణలు చేస్తూ ఇలాంటి వాటికి భయపడేది లేదు.. నన్ను మానసికంగా వేధించినందుకు 75 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ నోటీసులు పంపించింది షెర్లిన్.