ఈ కథ అందరికీ తెలియాలి.. రామ్ గోపాల్ వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ గోపాల్ వర్మ ఈ పేరు అంటేనే వెంటనే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ. ఎవరు ఏమనుకుంటున్నారో అని కూడా ఆలోచించకుండా ఏ వ్యక్తి మీద అయినా ఎలాంటి సున్నితమైన అంశాల మీద అయినా సరే తన భావాలూ వ్యక్తం చేసి సేన్సేన్షన్ క్రియాట్ చేసి సెంటర్ అఫ్ అట్రాక్షన్ మారడం వర్మకి మొదటినుండి అలవాటటే.ఇది ఇలా ఉంటే వరంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, అలాగే మాజీ ఎమ్మెల్యే కొండా మురళి జీవిత కథ ఆధారంగా కొండ అనే పేరుతో మరొక బయోపిక్ శ్రీకారం చుట్టాడు.జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న కొండా సినిమా వరంగల్ లో ప్రారంభం అయ్యింది.

ఇందులో అదిత్ అరుణ్,ఇర్రా మోర్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్స్ సమర్పణలో యో యో టాకీస్ పతాకంపై మల్లారెడ్డి నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సురేఖ, మురళి గార్ల జీవిత ఈ కథని అందరికీ తెలియాలని కొండ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వారి జీవిత చరిత్రను 10శాతం సినిమాలో చూపించినా నా ప్రయత్నం విజయవంతం అయినట్లే అన్నారు. నిజ జీవితంలో ఆ దంపతులు ఎలా ధైర్యంగా నిలబడ్డారు అనేది కొండ సినిమా ద్వారా చూపించబోతున్నాం అని నిర్మాత ముకుంద్ అన్నారు.