ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ అదుర్స్..!

గోపీచంద్ , నయనతార కలిసి నటించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్టు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించారు. దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇక దాంతో అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెలలో 8వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.

ఇక ఈ రోజున కొద్ది నిమిషాల ముందు ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ సినిమాలు విడుదల చేశారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమాలో గోపీచంద్ ఫుల్ యాక్షన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఒక బలాదూర్గా తిరుగుతూ ఉంటాడు.. తన తండ్రి చేతిలో తిట్లు తినే కొడుకు గా కనిపిస్తాడు.

అలా తింటున్న సమయంలో ఒక గొడవలు తన తండ్రి కి సపోర్ట్ గా పోతాడు గోపీచంద్. ఇక ఈ సినిమాలోని చెప్పే డైలాగ్”నా ఆస్తి.. దానిమీద కాశీ కాదు కదా.. వాడు అమ్మ మొగుడు వచ్చిన సరే రెక్టార్ స్కేల్పై పగిలిపోద్ది”అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా టైలర్ బాగున్నప్పటికీ మరి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాలి.